Begin typing your search above and press return to search.

ఒకే రోజు ఇద్దరు భార్యలు మరణించారు

మొయినాబాద్ మండలం నక్కలపల్లికి చెందిన అంతయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. పేదరికంలో కొట్టుమిట్లాడే అతనికి చాలా కాలం క్రితమే పెళ్లైంది

By:  Tupaki Desk   |   15 Sep 2023 4:13 AM GMT
ఒకే రోజు ఇద్దరు భార్యలు మరణించారు
X

విచిత్రాలకు కొదవ లేనట్లుగా మారింది ఈ మధ్య కాలంలో. అల్లంత దూరాన ఎక్కడెక్కడో వినిపించే విచిత్రమైన వార్తలు కొన్ని ఇటీవల కాలంలో మన చుట్టూనే చోటు చేసుకోవటం ఎక్కువైంది. తాజా ఉదంతం గురించి తెలిసినంతనే.. ఇలాంటి భావన కలుగక మానదు. వేర్వేరుగా రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఇద్దరు భార్యలు.. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో మరణించిన విచిత్రమైన విషాద ఉదంతం తాజాగా హైదరాబాద్ శివారులోచోటు చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో చోటు చేసుకున్న ఈ వైనం స్థానికంగా అందరి నోట నానింది. మొయినాబాద్ మండలం నక్కలపల్లికి చెందిన అంతయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. పేదరికంలో కొట్టుమిట్లాడే అతనికి చాలా కాలం క్రితమే పెళ్లైంది. మొదటి పెళ్లి లక్ష్మితో జరిగింది. ఆమెకు పిల్లలు పుట్టకపోవటంతో.. అతగాడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు.. చంద్రమ్మ. లక్ష్మికి యాభై ఏళ్లు అయితే.. చంద్రమ్మకు నలభై ఏళ్లే. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతనికి పన్నెండేళ్లు.

ఇదిలా ఉంటే.. ఇద్దరు భార్యలు కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. వారికి వైద్యం చేయిస్తున్నారు. అనూహ్యంగా ఇద్దరు భార్యలు గంటల వ్యవధిలో ఒకేరోజు మరణించటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఒకే వ్యక్తికి చెందిన ఇద్దరు భార్యలు ఒకే రోజు చనిపోయిన వైనం స్థానికంగా సంచలనమైంది. అంత్యక్రియలు నిర్వహించేంత ఆర్థిక స్తోమత లేని నేపథ్యంలో.. స్థానికులు కలిసి కట్టుగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయ్యో అనిపించే ఈ విషాదం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.