Begin typing your search above and press return to search.

టీవీ నటి ఐశ్వర్య మాజీ భర్తపై కేసు.. ఏమిటీ గొడవ?

ఇటీవల ఐశ్వర్య మాజీ భర్త ఆమెపై తీవ్ర ఆరోపణలు చేయటం.. వేరే వారితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 March 2024 5:26 AM GMT
టీవీ నటి ఐశ్వర్య మాజీ భర్తపై కేసు.. ఏమిటీ గొడవ?
X

కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనూ సంచలనంగా మారిన టీవీ సీరియల్ నటి ఐశ్వర్య అంశం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఆమె మాజీ భర్తపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో గురువారం కేసు నమోదైంది. ఒక వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు అతడి మీద కేసు నమోదు చేశారు. ఇటీవల ఐశ్వర్య మాజీ భర్త ఆమెపై తీవ్ర ఆరోపణలు చేయటం.. వేరే వారితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించటం తెలిసిందే.

దీంతో.. ఒక చానల్ కు నేరుగా వెళ్లిన టీవీ నటి ఐశ్వర్య.. తన మాజీ భర్త తన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా పేర్కొనటం.. ఈ అంశాలన్ని సంచలనంగా మారటం తెలిసిందే. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. టీవీ నటి ఐశ్వర్యకు కమలాపురి కాలనీకి చెందిన బిజినెస్ మేన్ తో మూడేళ్ల క్రితం నుంచి పరిచయం ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా వారి పరిచయమైంది. ఇదిలా ఉంటే.. గత ఏడాది సెప్టెంబరు 6న ఆమెకు శ్యామ్ కుమార్ తో పెళ్లైంది.

వివాహం జరిగిన కొద్దిరోజులకే ఐశ్వర్యకు.. ఆమె భర్తకు మధ్య మనస్పర్థలు మొదలుకావటం.. గొడవలు పెరగటం జరిగింది. ఈ క్రమంలో సెప్టెంబరు 26న ఆ బిజినెస్ మేన్ కు ఫోన్ చేసిన శ్యామ్.. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని లేదంటే ఐశ్వర్యతో దిగిన ఫోటోల్ని మార్ఫింగ్ చేసి తప్పుడు పద్దతిలో ప్రచారం చేస్తానని.. పరువు తీస్తానని బెదిరించాడు. దీనికి లెక్క చేయని ఆ బిజినెస్ మేన్ స్పందించలేదు.

అయితే ఐశ్వర్య మాజీ భర్త కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. ఐశ్వర్యకు.. వ్యాపారవేత్త కు మధ్య వివాహేతర సంబంధం ఉందని.. వారిద్దరిని తాను ఒకే గదిలో చూసినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రంగంలోకి దిగి..ఒక టీవీ చానల్ ముందుకు వెళ్లి లైవ్ లో తన మాజీ భర్త చేస్తున్న ఆరోపణల్ని తప్పుడవన్న విషయాన్ని వెల్లడించారు.

ఇదే సమయంలో.. తనకు.. ఐశ్వర్యకు ఎలాంటి సంబంధం లేకున్నా తప్పుడు పద్దతిలో ఆమె మాజీ భర్త తనను బెదిరింపులకు దిగుతున్నట్లుగా వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఐశ్వర్యతో ఒక గదిలో ఉన్నట్లుగా ఆమె మాజీ భర్త చెబుతున్న రోజున తాను ఆస్ట్రేలియాలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబరు 9న తన భార్య వ్యాపారవేత్త తో ఒకే గదిలో ఉన్నట్లు శ్యామ్ పేర్కొనగా.. తాను అక్టోబరు 4 నుంచి 14 వరకు ఆస్ట్రేలియాలో ఉన్నట్లుగా ఆ బిజినెస్ మేన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో అతడిపై కేసును నమోదు చేశారు.