Begin typing your search above and press return to search.

ట్రైన్ లో చోరీ.. దొంగకు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రయాణికులు

బిహార్ లోని భాగల్ పుర్ జిల్లాకు చెందిన ఒక దొంగ.. కదులుతున్న ట్రైన్ లోని పర్సును దొంగలించే ప్రయత్నం చేశారు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 10:30 AM GMT
ట్రైన్ లో చోరీ.. దొంగకు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రయాణికులు
X

విన్నంతనే వణుకు పుట్టే శిక్షను వేశారు రైల్వే ప్రయాణికులు ఒక దొంగకు. ట్రైన్ జర్నీ వేళ.. చేతి వాటం చూపే దొంగల కారణంగా ప్రయాణికులు పడే అవస్థలు అన్ని ఇన్ని కావు. ఇదిలా ఉంటే.. తాజా ఉదంతంలో ట్రైన్ లో పర్సు దొంగతనం చేసే ప్రయత్నం చేసిన ఒక దొంగకు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు ఆ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు. అనూహ్యంగా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అసలేం జరిగిందంటే.

బిహార్ లోని భాగల్ పుర్ జిల్లాకు చెందిన ఒక దొంగ.. కదులుతున్న ట్రైన్ లోని పర్సును దొంగలించే ప్రయత్నం చేశారు. అయితే.. అప్రమత్తంగా ఉన్న ఆ రైల్లోని ప్రయాణికులు ఆ దొంగను పట్టుకున్నారు. అక్కడితో ఆగని వారు.. చోరీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. కదులుతున్న ట్రైన్ లో సదరు దొంగ చేతుల్ని కిటీకీ వైపు పట్టేసుకున్నారు.

దీంతో.. కొన్ని మీటర్ల పాటు కదులుతున్న రైలు కిటికీకి వేలాడదీశారు. దీంతో.. లబోదిబోమన్న దొంగ.. తన చేతుల్ని విడిచి పెట్టాల్సిందిగా వేడుకున్నాడు. అయినప్పటికీ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాత్రం ససేమిరా అన్నారు. చోరీకి పాల్పడే దొంగకు దిమ్మ తిరిగే షాకిచ్చిన ప్రయాణికుల కారణంగా.. సదరు దొంగకు పగలే చుక్కలు కనిపించాయి. చివరకు ట్రాక్ మారే వేళ.. అక్కడున్న కొందరు.. ఆ దొంగను దింపటంతో బతికి బయటపడ్డాడు. దీనికి సంబంధించి తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.