Begin typing your search above and press return to search.

పిడుగురాళ్లలో దారుణం: ఒకే ఫ్యామిలీలో ముగ్గురిని చంపేశారు

బుధవారం అర్థరాత్రి వేళ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు దారుణంగా కత్తులతో నరికి చంపేశారు.

By:  Tupaki Desk   |   23 Nov 2023 5:43 AM GMT
పిడుగురాళ్లలో దారుణం: ఒకే ఫ్యామిలీలో ముగ్గురిని చంపేశారు
X

పల్నాడు జిల్లాలో దారుణ హత్యోదంతం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసిన ఘటన పెను సంచలనంగా మారింది. కుటుంబ కలహాలతో బంధువులే ఈ దారుణానికి పాల్పడటం షాకింగ్ గా మారింది. బుధవారం అర్థరాత్రి వేళ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు దారుణంగా కత్తులతో నరికి చంపేశారు. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఈ దారుణ హత్యకు కుటుంబ కలహాలు కారణంగా భావిస్తున్నారు. హత్యకు గురైన వారిని సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్ (30)గా గుర్తించారు. హత్యకు సంబంధించిన అసలు కారణాలు బయటకు రావాల్సి ఉంది. అర్థరాత్రి దాటిన వేళ ఇంటికి వెళ్లి కత్తులతో నరికేశారు.

తాము అనుకున్నట్లే హత్యలు చేసిన తర్వాత ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ కు వచ్చిన నిందితులు లొంగిపోవటం గమనార్హం. పోలీసు స్టేషన్ కు వచ్చిన వారిలో హత్యకు గురైన సాంబశివరావు కోడలు మాధురి.. ఇతర నిందితులు లొంగిపోయారు. వీరిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.