Begin typing your search above and press return to search.

ఆ బ్రదర్స్ గెలిచి...ఈ బ్రదర్స్ ఓడారు

బీఆర్ఎస్ అభ్యర్థులు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్‌లపై వీరు గెలిపొందారు.

By:  Tupaki Desk   |   3 Dec 2023 2:11 PM GMT
ఆ బ్రదర్స్ గెలిచి...ఈ బ్రదర్స్ ఓడారు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తన సత్తా చాటింది. కోమటిరెడ్డి బ్రద్రర్స్ కు మంచి పట్టున్న ఈ జిల్లాలలో హస్తం పార్టీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు దివంగత కాంగ్రెస్ నేత వెంటకస్వామి కుమారులు గడ్డం బ్రదర్స్ గెలిచారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నుంచి గడ్డం వివేక్, బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థులు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్‌లపై వీరు గెలిపొందారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వివేక్ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరడం విశేషం.

ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ తమ సత్తా తగ్గలేదని మరోసారి నిరూపించారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిపై గెలుపొందారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.... బీఆర్ఎస్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై గెలుపొందారు. రాజ గోపాల్ కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడం విశేషం.

కాంగ్రెస్ పార్టీకి బ్రదర్స్ సెంటిమెంట్ కలిసి వస్తే...బీఆర్ఎస్, బీజేపీలకు మాత్రం అచ్చి రాలేదు. పాలకుర్తిలో బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోగా...వరంగల్ ఈస్ట్ లో కొండా సురేఖ చేతిలో ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.