Begin typing your search above and press return to search.

భర్త, ప్రియుడు ఇద్దరూ కావాలంటూ కరెంట్ స్తంభం ఎక్కి ధర్నా!

దీంతో... పెళ్లిల్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనడానికి వీరు విరుద్దం అయ్యి ఉంటుందనే కామెంట్లు వినిపిస్తుంటాయి.

By:  Tupaki Desk   |   4 April 2024 12:13 PM GMT
భర్త, ప్రియుడు ఇద్దరూ  కావాలంటూ కరెంట్  స్తంభం ఎక్కి ధర్నా!
X

ఇటీవల కాలంలో చాలామంది దాంపత్య జీవితాలు సీతారాముళ్లా ఉంటే... మరికొందరి జీవితాలు మాత్రం దారితప్పుతుంటున్నాయి! ఈ క్రమంలో వీటికి ప్రధాన కారణం వివాహేతర సంబాధాలే అనే విషయం పలు సందర్భాల్లో రుజువైంది! ఈ మేరకు నిత్యం ఏదో మూల ఇలాంటి ఘటనలు తెరపైకి వస్తుంటాయి. దీంతో... పెళ్లిల్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనడానికి వీరు విరుద్దం అయ్యి ఉంటుందనే కామెంట్లు వినిపిస్తుంటాయి.

ఫలితంగా... భార్యా భర్తలు విడిపోవడం, వీరిద్దరిలో ఎవరికి వివాహేతర సంబంధం ఉంటే వాళ్ల కోరిక మేరకు విడిపోయి బ్రతకడం, అప్పటికి పిల్లలు కూడా ఉంటే వారు సింగిల్ పేరెంట్ కిడ్స్ అవ్వడం, వారి పేరెంట్స్ చేసిన పనులకు వీరు శపాగ్రస్తులు అవుతుండటం జరుగుతూ ఉంటుంటుంది! ఆ సంగతి అలా ఉంటే… వివాహేతర సంబంధం ఉన్న ఓ మహిళ తాజాగా.. రొటీన్ కి భిన్నంగా ఆలోచించింది. ఇద్దరితోనూ కలిసి ఉంటానంటుంది!

అవును... భర్త, పిల్లలూ ఉన్న ఓ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే చివరికి ఆ వ్యవహారం కాస్త బయటపడింది. దీంతో... తప్పు ఒప్పుకుని భర్తతో కలిసి ఉండటమో.. లేక, భర్తతో విడాకులు తీసుకుని పోవడమో కాకుండా.. ఇద్దరితోనూ కలిసి ఉంటానంటూ మోండిపట్టుపట్టింది. అందుకు ఇంట్లోవాళ్లు అంగీకరించకపోవడంతో కరెంట్ స్తంభం ఎక్కు నిరసన చేపట్టింది.

వివరాళ్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో బుధవారం ఒక రొటీన్ కి భిన్నమైన సంఘటన జరిగింది! ఇక్కడ 34 ఏళ్ల మహిళకు చాలాకాలం క్రితమే ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు! అయితే... గత ఏడేళుగా సదరు మహిళ పక్కూరికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇలాంటి పనులు కాస్త అటూ ఇటూగా ఎప్పటికైనా బయటపడతాయన్నట్లుగా ఆమె భర్తకు ఈ విషయం తెలిసిపోయింది.

దీంతో ఆమెను నిలదీయడం.. వారి మధ్య గొడవ జరగడం వరుసగా జరిగిపోయింది. ఈ క్రమంలో తన ప్రియుడు కూడా తనతోనే ఉంటాడని, అలాగైతే ఇంటి ఆర్ధిక సమస్యలు కూడా తొలుగుతాయని భర్తను కోరింది. దీనికి అతడు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. ఇందులో భాగంగా గ్రామంలోని కరెంట్ స్తంభం ఎక్కింది.

దీంతో... ఈ విషయం గమనించిన స్థానికులు కరెంట్ ఆఫీసుకి ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు! ఈ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను బలవంతంగా కిందకు దించారు! దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. తర్వాత ఏమి జరిగిందనేది తెలియాల్సి ఉంది!!