Begin typing your search above and press return to search.

90లలో కాశ్మీర్‌ను వణికించిన JKLF..దాని చరిత్ర ఇదే !

అయితే, కాశ్మీర్‌లో కేవలం TRF మాత్రమే కాదు, 90ల కాలంలో ఒక భయంకరమైన టెర్రరిస్ట్ సంస్థ కూడా ఉండేది. అది కాశ్మీర్‌లో తీవ్రమైన భీభత్సం సృష్టించింది.

By:  Tupaki Desk   |   23 April 2025 11:45 AM
90లలో కాశ్మీర్‌ను వణికించిన JKLF..దాని చరిత్ర ఇదే !
X

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లోని బైసరన్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది. అమాయకుల మీద ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రపంచం అంతా ఖండిస్తోంది. టెర్రరిస్టులు పర్యాటకుల గుంపును లక్ష్యంగా చేసుకుని 26 మందిని అత్యంత కిరాతకంగా చంపేశారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి TRF అంటే లష్కరే తోయిబా విభాగమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది. అయితే, కాశ్మీర్‌లో కేవలం TRF మాత్రమే కాదు, 90ల కాలంలో ఒక భయంకరమైన టెర్రరిస్ట్ సంస్థ కూడా ఉండేది. అది కాశ్మీర్‌లో తీవ్రమైన భీభత్సం సృష్టించింది.

90వ దశకంలో అనేక టెర్రరిస్ట్ సంస్థలు చురుకుగా ఉండేవి. వాటిలో ముఖ్యమైనవి జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అంటే JKLF, హర్కత్-ఉల్-ముజాహిదీన్, దానితో పాటు లష్కరే తోయిబా. అయితే, 90లలో జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అత్యధిక భీభత్సం సృష్టించింది. ఈ సంస్థ 1980లో స్థాపించబడింది. దీనికి యాసిన్ మాలిక్ నాయకత్వం వహించారు.

JKLF అంటే ఏమిటి?

జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ (JKNF) మే 1977లో బ్రిటన్‌లో స్థాపించారు. దీనిని అమానుల్లా ఖాన్ ప్రారంభించాడు. అమానుల్లా ఖాన్ చాలా మంది సహచరులు చనిపోవడం... సైనికకుల చేతికి చిక్కిన తర్వాత తను కోపంతో ఈ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మీర్‌పూర్ కమ్యూనిటీ నుంచి సపోర్ట్ లభించింది. సెప్టెంబర్ 1995లో యాసిన్ మాలిక్ నేతృత్వంలో ఒక వర్గం JKLF నుంచి విడిపోయింది.

కాశ్మీరీ పండిట్‌లను తరిమికొట్టడంలో కీలక పాత్ర

యాసిన్ మాలిక్ నేతృత్వంలోని ఈ సంస్థ రాష్ట్రంలో స్వాతంత్ర్యం కోసం నినాదాలు చేసింది. అలా చేసిన మొదటి సంస్థ ఇదే. ఇది మొదటిసారిగా 1989 సెప్టెంబర్ 14న బీజేపీ నాయకుడు, కాశ్మీరీ పండిట్ అయిన పండిట్ టీకాలాల్ తప్లూను లక్ష్యంగా చేసుకుంది. ఈ సంస్థ మూడు ప్రభుత్వ భవనాల్లో కూడా పేలుళ్లకు పాల్పడింది. కాశ్మీరీ పండిట్‌లను కాశ్మీర్ నుంచి తరమేలా చేయడంలో JKLF కీలక పాత్ర పోషించింది. ఇది లోయలో భయం, హింసాత్మక వాతావరణాన్ని సృష్టించింది. లోయలో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా కాశ్మీరీ పండిట్‌లు ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయారు.