రేవంత్ను చూసి.. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు!
తాజాగా రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూభారతి ప్రాజెక్టును ములుగు జిల్లాలోని వెంకటాపురం లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
By: Tupaki Desk | 18 April 2025 12:24 PMతెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజాప్రభుత్వాన్ని చూసి కొందరు కళ్లలో నిప్పు లు పోసుకుంటున్నారని.. మంత్రి సీతక్క మాస్ డైలాగులతో రెచ్చిపోయారు. పేదలకు మంచి చేయాల న్న సంకల్పంతోనే భూభారతిని తీసుకువచ్చామని.. కానీ, దీనిని చూసి ఓర్వలేక.. బీఆర్ ఎస్ నాయకులు కడుపునొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. ఏదేమైనా.. పేదలకు మేలు చేసేందుకు తాము ఎప్పుడూ ముందే ఉంటామన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదన్నారు.
తాజాగా రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూభారతి ప్రాజెక్టును ములుగు జిల్లాలోని వెంకటాపురం లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొడా సురేఖ పాల్గొన్నారు. సీతక్క మాట్లాడుతూ.. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొట్టిందని.. వారికి పట్టాల బదులు నష్టాలు మిగిల్చిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అధికారులను మచ్చిక చేసుకుని బీఆర్ఎస్ నాయకులు భూములు కాజేశారని విమర్శలు గుప్పించారు.
దీని నుంచి రైతులను కాపాడేందుకు.. వారికి అండగా నిలిచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. భూభారతి తీసుకువచ్చిందని సీతక్క చెప్పారు. అయితే.. దీనిని కూడా ఓర్వలేక కొందరు కళ్లలో నిప్పులు పోసుకుం టున్నారని దుయ్యబట్టారు. మహిళలకు ఇవ్వాల్సిన 3 వేల కోట్ల రూపాయల రాయితీ వడ్డీని కేసీఆర్ ఎగ్గొ ట్టారని అన్నారు. తమది పెట్టే ప్రభుత్వమేనని.. దోచుకునే ప్రభుత్వం కాదని తెలిపారు. ధరణి పోర్టల్ పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టారంటూ.. కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ రైతుల గురించి తప్ప మిగిలిన వాటిని బాగానే పట్టించుకున్నారని సురేఖ ఎద్దేవా చేశారు. ఎకరా లకు ఎకరాల రైతుల భూములు లాక్కున్న ఘనత కేసీఆర్ కుటుంబానిదేనని పేర్కొన్నారు. గతంలో రైతులు కోల్పోయిన భూములను తిరిగి వారికి అందించేందుకే భూభారతిని తీసుకువచ్చామని సురేఖ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు భూభారతిని తీసుకువచ్చామని మంత్రి పొంగులేటి అన్నారు. భూభారతి చట్టంలో గతంలో ఉన్న తొమ్మిది లక్షల 50 వేల అప్లికేషన్ల సమస్యలను పరిష్కరించే విధంగా మార్పులు చేసినట్టు తెలిపారు. దోచుకున్న వారి నుంచి కక్కిస్తామని బీఆర్ ఎస్ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.