Begin typing your search above and press return to search.

వారు చెప్పించారు.. ఆయ‌న చెప్పారు.. గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌పై టీడీపీ కామెంట్‌

అయితే.. ఆయ‌న ప్ర‌సంగంపై టీడీపీ ఆస‌క్తికర కామెంట్ చేసింది. "వారు చెప్పించారు.. ఆయ‌న చెప్పారు" అని వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం.

By:  Tupaki Desk   |   5 Feb 2024 9:08 AM GMT
వారు చెప్పించారు.. ఆయ‌న చెప్పారు.. గ‌వ‌ర్న‌ర్ స్పీచ్‌పై టీడీపీ కామెంట్‌
X

ఏపీలో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మ‌రో రెండు మాసాల్లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఏప్రిల్‌, మే, జూన్ కాలాల‌కు సంబంధించి వైసీపీ ప్ర‌భుత్వం తాజాగా బ‌డ్జెట్‌ను బుధ‌వారం ప్ర‌వేశ పెట్ట‌నుం ది. అయితే.. స‌భ‌ల ప్రారంభానికి సంబంధించి తొలి రోజు గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగించారు. అయితే.. ఆయ‌న ప్ర‌సంగంపై టీడీపీ ఆస‌క్తికర కామెంట్ చేసింది. "వారు చెప్పించారు.. ఆయ‌న చెప్పారు" అని వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలోని కీల‌క అంశాలు ..

ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాల తొలిరోజు గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ ప్ర‌సంగించారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. విజయవాడలో భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ 206 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయమన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వ మని పేర్కోన్నారు.

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడేందుకు కృషి చేస్తున్నట్లు గ‌వ‌ర్న‌ర్‌ తెలిపారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యార్ధులు, మహిళలు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు. పేద విద్యార్ధులకు ప్రపంచ స్ధాయి విద్యా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు విద్యారంగంలో 73 వేల 417 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు.

నవరత్నాలు పేరుతో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. జగనన్న అమ్మ ఒడితో అర్హులైన విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చా మని తెలిపారు.1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్ధులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. జగనన్న గోరుముద్ద కోసం ఏటా వెయ్యి 910 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా....ఇప్పటివరకూ గోరుముద్ద కింద 4వేల 417 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు.

దేశంలొ ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యకు ప్రాధాన్యత నిస్తోందన్నారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్దికి ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తోందన్నారు. రైతులే రాష్ట్రానికి వెన్నుముక అనే లక్ష్యంతో రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతంరం కృషి చేస్తోందని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు. 10వేల 778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 53 లక్షల 53 వేలమంది రైతులకు రైతు భరోసా అందించినట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందిస్తున్నామని తెలిపారు.