తమ్ముళ్ల మధ్య సీనియార్టీ వివాదం.. ఇది కష్టమే.. !
ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్న టీడీపీలో నాయకులు తలకో రకంగా ఉన్నారు.
By: Tupaki Desk | 9 May 2025 6:00 PM ISTఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తున్న టీడీపీలో నాయకులు తలకో రకంగా ఉన్నారు. కొందరు సర్దుబాటు ధోరణిని ప్రదర్శిస్తే.. మరికొందరు ఆధిపత్య రాజకీయాలు చేసుకుం టున్నారు. ఏదైనా తలనొప్పిగానే ఉంది. ఇక, మరికొన్ని నియోజకవర్గాల్లో యువతకు ప్రాధాన్యం లేకుం డా పోతోంది. ఉదాహరణకు.. 15 నుంచి 20 నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు యువతకు ప్రాధాన్యం ఇచ్చారు.
కొత్త ముఖాలే అయినా.. వారిని గెలిపించుకున్నారు. వీరిలో కొందరు ఫైర్ బ్రాండ్స్ మాదిరిగా చెలరేగిపో తున్నారు. తిరువూరు, గుంటూరు వెస్ట్, కడప, కర్నూలు పార్లమెంటు స్థానాల్లో నాయకులు.. పురుషుల కంటే దీటుగా దూకుడుగా ఉన్నారు. అయితే.. ఇదేసమయంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సీనియా ర్టీని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యేలపై కొందరు పైచేయి సాధిస్తున్నారు. దీనిపై తాజాగా తిరుపతిలో పర్యటిం చిన నారా లోకేష్కు ఫిర్యాదులు అందాయని తెలిసింది.
``ఇలా అయితే.. ఎలా మీరు పట్టించుకోవాలి`` అని జూనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకులు నారా లోకేష్ ముందుకు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వాల్యూలేకుండా చేస్తున్నారని.. ప్రతి పనినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెబుతున్నారు. సీనియర్లను తాము గౌరవిస్తున్నామని.. కాని.. వారు తమపై పెత్తనం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సీమకు చెందిన కొత్త నాయకులు... నారా లోకేష్ ముందు బావురుమన్నారు.
అయితే.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ముందు పెడతామని.. మీరు పనులు చేసుకోవాలని నారా లోకేష్ సర్దిచెప్పారు. ఇది సీమకే పరిమితం కాలేదు. కోస్తాలోనూ.. కొత్త నాయకులు ఇబ్బందులు పడుతు న్నారు. అయితే.. అటు సీనియర్లను ఏమీ అనే పరిస్థితి లేకుండా పోయింది. వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చే విషయంలో జూనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేల దూకుడు సరిపోవడం లేదు. అలాంటి చోట సీనియర్లే బలంగా ఉన్నారన్నది పార్టీ భావన. అయితే.. ఈ వ్యవహారం ముదురుతున్న క్రమంలో తమకు ప్రాధాన్యం తగ్గుతోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.