మంత్రి గారు బహు చక్కని రైతు
ఆయనలో బహుముఖ ప్రజ్ఞా పాటవాలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు పూర్వం వృత్తి రిత్యా అధ్యాపకుడిగా ఉంటూ వచ్చారు.
By: Tupaki Desk | 9 May 2025 2:45 AMఆయనలో బహుముఖ ప్రజ్ఞా పాటవాలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు పూర్వం వృత్తి రిత్యా అధ్యాపకుడిగా ఉంటూ వచ్చారు. అంతే కాదు తనకంటూ ఉన్న సొంత పొలంలో ఆయన బహు చక్కని రైతుగా కూడా ఉన్నారు. గోదావరి జిల్లా ప్రేమను అందరికీ పంచుతూ సగటు మనిషిగా అందరిలోనూ కలసిపోతూ మంచి మాటకారిగా సమయస్పూర్తి కలిగిన వారిగా మెలిగారు. అందుకే ఆయనను రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రోత్సహించింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈ రోజు కీలకమైన జలవనరుల శాఖకు మంత్రిగా ఉన్నారు అంటే ఆ ఘనత అక్షరాలా రామానాయుడుదే.
ఇదిలా ఉంటే రామానాయుడుని ఆదర్శ రైతుగా కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఒక రైతుగా ఆయన చేసిన సేవలను ప్రభుత్వ అధికారులు మెచ్చుకుంటున్నారు. దాల్వా వరి సాగుతో ఎకరానికి ఏకంగా 65 బస్త్లాల అధిక దిగుబడులు సాధించి రైతుగా రామానాయుడు సత్తా చాటారు. తన సొంత పొలంలో సాధించిన ఫలితాలతో రైతాంగానికి ఆయన ఒక స్పూర్తిదాతగా మారారు.
ఆ వివరాలను వ్యవసాయ అధికారిణి పార్వతి మీడియాకు చెబుతూ రామానాయుడులోని రైతు బిడ్డను ఆవిష్కరించారు. అతి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు ఎలా సాధించాలో ఆచరణలో ఆయన చేసి చూపించారు. ఇక్కడ రామానాయుడు అనుసరించిన యాజమాన్య పద్ధతులు శాస్త్రవేత్తలు వయ్వసాయ అధికారుల సూచనలు సలహాలు తీసుకుని ఆయన చేసిన సాగు వంటికి హైలెట్ చేస్తున్నారు.
పాలకొల్లులో ఉత్తమ రైతుగా రామానాయుడు ఈ విధంగా నిలిచారు. ఇక వివరాలు చూస్తే కనుక రామానాయుడు పాలకొల్లులోని అగర్తిపాలెం గ్రామంలో తన ఆరు ఎకరాల విస్త్రీర్ణంలో వరి పి ఆర్ 126 సన్న రకం దాల్వా సాగు చేశారు ఇలా ఎకరానికి 65 బస్తాల దిగుబడితో మొత్తం ఆరు ఎకరాలలో 390 బస్తాల దిగుబడిని సాధించారు.
ఇలా అతి తక్కువ పెట్టుబడితోనే మంత్రి ఒక రైతుగా ఎంత చేయవచ్చో అంతా చేసి చూపించారు. దెంతో అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆయన పొందడమే కాదు వ్యవసాయం పండుగ అని నిరూపించారు. ఒక వైపు ఎమ్మెల్యేగా ఉంటూ మరో వైపు మంత్రిగా కీలక శాఖను చూస్తూ బిజీ లైఫ్ గడిపే ఆయనకు ఎక్కడ తీరుబాటు ఉందో తెలియదు కానీ రైతుగా మారిపోయి ఇలా పంట సిరులని పండించారు అని అంటున్నారు.
ఇక ఆయన తన సమయాన్ని ఎలా వ్యవసాయం కోసం వెచ్చించేవారు అంటే వారంలో రెండు రోజుల సమయం ఖాళీ చేసుకుని పోలంలోకి దిగిపోయేవారు. స్వయంగా నాట్లు వేయడం నుంచి ఎరువులు వేయడం పురుగుల మందులు జల్లడంతో పాటు ఇల ఆన్నేక రకాలైన పనులను సాటి వ్వవసాయ కూలీలతో పాటు కలసి చేసేవారు. ఇలా సస్య రక్షణ చర్యలను వ్యవసాయ శాఖ సూచనల మేరకు తీసుకుని సక్సెస్ ఫుల్ ఫార్మర్ గా నిలిచారు. ఇలా ఆదర్శ రైతుగా మారిన మంత్రిని అంతా అభినందిస్తున్నారు.