కొబ్బరికాయ కొట్టేశారు.. చంద్రబాబు మరో సంబరం!
ఏపీ సీఎం చంద్రబాబు మరో సంబరానికి సిద్ధమయ్యారు. రెండు రోజుల కిందటే.. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టాన్ని అంబరమంత సంబరంతో నిర్వహించిన ఆయన.. ఇప్పుడు ఇంకో వేడుకకు కొబ్బరికాయ కొట్టారు.
By: Tupaki Desk | 5 May 2025 3:37 AMఏపీ సీఎం చంద్రబాబు మరో సంబరానికి సిద్ధమయ్యారు. రెండు రోజుల కిందటే.. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టాన్ని అంబరమంత సంబరంతో నిర్వహించిన ఆయన.. ఇప్పుడు ఇంకో వేడుకకు కొబ్బరికాయ కొట్టారు. అదే.. టీడీపీ `మహానాడు`. పార్టీకి అత్యంత కీలకమైన మహానాడు ద్వారా.. టీడీపీకి దశ-దిశ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ దఫా మహానాడును వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో నిర్వహించాలని ఆరు మాసాల కిందటే నిర్ణయించారు. నిజానికి పార్టీ ఆవిర్భవించిన 40 ఏళ్లకుపైగా కాలంలో కడపలో మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి.
అది కూడా.. జగన్ సొంత మేనమామ, విజయమ్మ తమ్ముడు పి. రవీంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం(గత ఎన్నికల్లో ఓడిపో యారు) కమలాపురంలో ఈ దఫా మహానాడుకు శ్రీకారం చుట్టారు. నియోజవకర్గంలోని చింతకొమ్మ దిన్నె మండలంలో సుమా రు 120కి పైగా ఎకరాలలో మహానాడును నిర్వహిస్తున్నారు. ఆదివారం ఈ ప్రాంతంలో టీడీపీ నాయకులు, కమలాపురం ఎమ్మె ల్యే పుత్తా చైతన్య రెడ్డి సందర్శించి.. కొబ్బరికాయ కొట్టి.. భూమి పూజనిర్వహించారు. అనంతరం.. 120 ఎకరాల భూమిని చదును చేసే కార్యక్రమాన్ని స్వయంగా ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ భూమిని నెల రోజుల పాటు లీజు ప్రాతిపదికన స్థానిక రైతుల నుంచి సేకరించారు. వారికి నెల రోజులకు గాను.. కొంత సొమ్ము ను ఇచ్చి.. అంగీకార పత్రాలు కూడా తీసుకున్నారు. ఇక, ప్రజల స్పందన.. పార్టీ కార్యకర్తలు వచ్చే సంఖ్యను బట్టి.. మహానాడు కు మరో 50 ఎకరాల భూమిని లీజుకు తీసుకునే ఆలోచన ఉందని నాయకులు తెలిపారు. కాగా.. ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించే ఈ మహానాడుకు సుమారు 5 లక్షల మందికిపైగా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తారని అంచనా వేశారు. అదేవిధంగా ఎన్నారై టీడీపీ నాయకులు కూడా వస్తారని చెబుతున్నారు.
ఈ నెల 25 నుంచే స్థానికంగా ఉన్న అన్ని హోటళ్లను టీడీపీ నాయకులు బుక్ చేసుకున్నారు. సుమారు 3 వేలకు పైగా ప్రతిని ధులు వచ్చే అవకాశం ఉందని.. భావిస్తున్న నాయకులు.. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న అన్ని హోటళ్లను బుక్ చేశారు. ఇక, మహానాడుకు సుమారు 15 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసుకున్నారు. భూమి లీజు, నిర్మాణం, భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు అన్నీ లెక్క చూసుకుని పార్టీ అధినేత చంద్రబాబుకు వివరాలు అందించినట్టు మహానాడు కార్యక్రమాలు చూసే నేత ఆర్ . శ్రీనివాసరెడ్డి చెప్పారు.