పదకొండేళ్ల విద్యార్థితో యంగ్ టీచర్ వెళ్లిపోయింది.. ఎక్కడంటే?
ఊహకు అందని విచిత్ర పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. విన్నంతనే రీల్ సీన్లుగా అనిపించేలా ఉన్న ఇవన్నీ రియల్ కావటం షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 1 May 2025 4:01 AMఊహకు అందని విచిత్ర పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. విన్నంతనే రీల్ సీన్లుగా అనిపించేలా ఉన్న ఇవన్నీ రియల్ కావటం షాకింగ్ గా మారింది. ఎంత బుర్ర బద్ధలు కొట్టుకున్నా లాజిక్ అందని ఈ ఉదంతాలు సంచలనాలుగా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి సూరత్ లో చోటు చేసుకుంది. వజ్ర వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సూరత్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువ టీచర్ వద్దకు 11 ఏళ్ల విద్యార్థి ఒకరు ట్యూషన్ కోసం వస్తుండేవారు.
ఈ మధ్యనే వీరిద్దరూ కనిపించకుండా పోయారు. దీనిపై విద్యార్థి తండ్రి.. తన కొడుకును టీచరమ్మ కిడ్నాప్ చేసి ఉంటుందంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో.. ఈ కేసు సంచలనంగా మారింది. స్థానికంగా హాట్ టాపిక్ గా మారిన ఈ కేసు లెక్క తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఇద్దరి కోసం జల్లెడ పట్టారు. బుధవారం వీరిద్దరిని రాజస్థాన్ సరిహద్దులోని ఒక ప్రైవేటు బస్సులో గుర్తించారు.
దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సూరత్ తరలించారు. ఇంతకూ వీరిద్దరు ఎందుకు వెళ్లిపోయినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఇద్దరు.. తమ ఇళ్లల్లో తిట్టే తిట్లు పడలేక కలిసి పారిపోవాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది ఈ రెండు కుటుంబాలు గడిచిన రెండు మూడేళ్లుగా పరిచయస్తులుగా గుర్తించారు.
ఇళ్లల్లో నుంచి వెళ్లే క్రమాన్ని గుర్తించేందుకు సీసీ ఫుటేజ్ ను జల్లెడ పట్టిన పోలీసులు.. వీరిద్దరూ కలిసే ఇళ్ల నుంచి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. అయితే.. బాలుడి వయసు 11 ఏళ్ల కంటే ఎక్కువగా ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంతకూ వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏమిటన్న దానిపై స్పష్టత రాలేదు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. మొత్తంగా ఈ కేసు స్థానికంగా సంచలనంగా మారింది.