Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కు బానిసై కన్నతండ్రిని చంపిన కొడుకు!

ఈ సమయంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం నడిచిందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   5 April 2024 4:50 PM GMT
డ్రగ్స్  కు బానిసై కన్నతండ్రిని చంపిన కొడుకు!
X

హైదరాబాద్ శివార్లలో దారుణం చోటు చేసుకుంది! డ్రగ్స్ కు బానిసైన ఓ వ్యక్తి.. కన్న తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పటించి హత్యచేసినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో పారిపోతున్న తండ్రిని తరిమి తరిమి మరీ నిప్పటించి, రాయితో తల పగలగొట్టి హత్య చేశాడని చెబుతున్నారు! గంజాయికి బానిసైన కొడుకు.. ఆ మత్తులో, తనకు బైక్ కొనుగోలు చేయలేదని ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తుంది.

తెలుస్తున్న వివరాల ప్రకారం... హైదరాబాద్ శివార్లలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని ఆరెంజ్ అవెన్యూ కాలనీలో అనురాగ్ (28) అనే వ్యక్తి తన తండ్రి రవీందర్ (54)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు! గంజాయికి అలవాటు పడి మానసికంగా అస్థిరంగా ఉన్న నిందితుడు... బైక్ కొనాలంటూ తన తండ్రిపై ఒత్తిడి తెచ్చాడంట. ఈ సమయంలో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం నడిచిందని తెలుస్తుంది.

ఈ సమయంలో రెండు బాటిళ్లతో పెట్రోల్ తెచ్చుకుని ఉంచుకున్న అనురాగ్... ఆవేశంతో ఊగిపోతూ తండ్రిపై తొలుత ఒక బాటిల్ తో దాడిచేశాడని.. ఈ సమయంలో రవీందర్ మొదటి అంతస్తు నుంచి కిందకు పరుగెత్తగా... మరో బాటిల్ తీసుకుని అనురాగ్ వెంబడించాడని చెబుతున్నారు. ఈ సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ కి చేరుకునేసరికి అనురాగ్ తన తండ్రికి లైటర్ తో నిప్పంటించాడని అంటున్నారు!

ఈ సమయంలో సహాయం కోసం కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసిన రవీందర్ ను అనురాగ్ వెంటపడి తరిమగా.. ఇంటి నుంచి సుమారు 120 దూరం పరుగెత్తి కుప్పకూలాడు! దీంతో... తన వద్ద మరో బాటిల్ లో ఉన్న పెట్రోల్ ను పోసిన అనురాగ్... అనంతరం ఒక బండరాయితో రవీందర్ తలపై గట్టిగా బాదాడంట!

ఈ సమయంలో తన తల్లి సుధను ఓ గదిలో బందించి.. షర్ట్ మార్చుకుని నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని చెబుతున్నారు. దీంతో... రంగంలోకి దిగిన పోలీసులు నేరం జరిగిన ప్రదేశం నుంచి ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు! ఈ క్రమంలో నిందితుడు అనురాగ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారని సమాచారం!