Begin typing your search above and press return to search.

కర్ణాటక కాంగ్రెస్ నేత కుమార్తెను కాలేజీలో చంపేశాడు!

కాలేజీలో నేహా ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. క్యాంపస్ లో నేహాను విచక్షణరహితంగా కత్తితో దాడి చేసిన వైనం సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది.

By:  Tupaki Desk   |   19 April 2024 8:30 AM GMT
కర్ణాటక కాంగ్రెస్ నేత కుమార్తెను కాలేజీలో చంపేశాడు!
X

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన ఒక నేత కుమార్తెను కాలేజీ క్యాంపస్ లో చొరబడి.. కత్తితో విచక్షణరహితంగా దాడి చేసిన హత్యకు పాల్పడిన వైనం తీవ్ర సంచలనంగా మారింది. హుబ్బళ్లిలో చోటు చేసుకున్న ఈ ఘోరం షాకింగ్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నిరంజన్ హిరేమఠ్ కుమార్తె 23 ఏళ్ల నేహాను ఎంసీఏ డ్రాపవుట్ ఫయాజ్ ఘోరంగా చంపేశాడు.

కాలేజీలో నేహా ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. క్యాంపస్ లో నేహాను విచక్షణరహితంగా కత్తితో దాడి చేసిన వైనం సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది. బీసీఏ కోర్సు చేస్తున్నప్పుడు వీరిద్దరికి పరిచయం ఏర్పడినట్లుగా చెబుతున్నారు. కత్తితో క్యాంపస్ లోకి అడుగు పెట్టిన ఫయాజ్.. నేహా కనిపించినంతనే తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణరహితంగా పొడిచేశాడు. ఈ క్రమంలో అతడికి గాయాలు అయ్యాయి. ఈ హఠాత్ పరిణామంతో కాలేజీ క్యాంపస్ లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

వీరిద్దరిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే నేహా మరణించినట్లుగా వైద్యులు వెల్లడించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారించగా.. తామిద్దరం ప్రేమించుకున్నామని.. అకస్మాత్తుగా తనను దూరం పెట్టటంతో తాను హత్య చేసినట్లుగా చెబుతున్నాడు. అయితే.. ఫయాజ్ చెప్పిన అంశాల్లో నిజం ఎంత? అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రేమించిన తర్వాత దూరంగా ఉంటే మాత్రం.. అంత దారుణంగా హత్య చేయటం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అధికార పార్టీకి చెందిన నేత కుమార్తెను చంపేసిన వైనం కర్నాటకలో ఇప్పుడు షాకిచ్చేలా మారింది.