Begin typing your search above and press return to search.

అనంతపురంలో మాజీ ప్రిన్సిపల్ ను హత్య చేసిన మేనల్లుడు

షాకింగ్ ఉదంతం ఒకటి అనంతపురం పట్టణంలో చోటు చేసుకుంది. ఊళ్లో పేరున్న ఒక మాష్టారిని అత్యంత దారుణంగా హతమార్చిన వైనం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   11 March 2024 5:17 AM GMT
అనంతపురంలో మాజీ ప్రిన్సిపల్ ను హత్య చేసిన మేనల్లుడు
X

షాకింగ్ ఉదంతం ఒకటి అనంతపురం పట్టణంలో చోటు చేసుకుంది. ఊళ్లో పేరున్న ఒక మాష్టారిని అత్యంత దారుణంగా హతమార్చిన వైనం షాకింగ్ గా మారింది. ఉన్నత విద్యావంతుడు.. పట్టణంలో సుపరిచితుడైన ఆయన్ను ఆయన మేనల్లుడే దారుణంగా హతమార్చటం ఏమిటన్న సందేహం హాట్ టాపిక్ అయ్యింది. పట్టణంలోని జేఎన్టీయూ ముఖద్వారానికి కూతవేటు దూరంలో ఉండే కాలనీలో ఉండే ఆయన్ను హతమార్చిన ఉదంతానికి కారణం ఏమిటన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇంతకూ ఆయన ఎవరు? అంటే.. మూర్తిరావు ఖోకలే. 59 ఏళ్ల ఆయన ఒక ఇంజనీరింగ్ కాలేజీకి మాజీ ప్రిన్సిపల్ గా పని చేశారు. ప్రస్తుతం శ్రీక్రిష్ణ దేవరాయ విశ్వవిద్యాలయానికి పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన జేఎన్టీయూ ముఖద్వారం ఎదురుగా ఉండే కాలనీలో నివసిస్తున్నారు. అలాంటి ఆయనపై ఆదివారం సాయంత్రం ఆయన మేనల్లుడు అనూహ్య రీతిలో దాడికి పాల్పడినట్లుగా చెబుతున్నారు.

బ్లేడ్ తో ఖోకలే గొంతే కోసిన ఉదంతంలో ఆయన మరణించారు. ఆయన మరణం వెనుక అసలు కారణం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఖోకలే మేనల్లుడే ఈ దారుణ హత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఆస్తి తగదాలతో పాటు ఇటీవల ఆయన కుమార్తె పెళ్లి విషయంలో మేనల్లుడు కినుకుతో ఉన్నాడని.. ఈ కోపంతోనే ఆయన్ను హతమార్చినట్లుగా భావిస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఖోకలే హత్య అనంతపట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. హత్య వెనుకున్న కారణం ఏమిటన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.