Begin typing your search above and press return to search.

తిరుపతిలో దారుణం.. ప్రియుడి కోసం భర్తను చంపి.. అప్పుల కథ చెప్పింది

తాజాగా టెంపుల్ సిటీగా పేర్కొనే తిరుపతి పట్టణంలో చోటు చేసుకున్న షాకింగ్ ఉదంతం పెను సంచలనంగానే కాదు.. జీర్ణించుకోవటానికి కష్టంగా మారింది.

By:  Tupaki Desk   |   18 Dec 2023 3:15 AM GMT
తిరుపతిలో దారుణం.. ప్రియుడి కోసం భర్తను చంపి.. అప్పుల కథ చెప్పింది
X

భార్యల్ని చంపే భర్తలు పాత మాట. ఇప్పుడు భర్తల్ని చంపేస్తున్న భార్యల కథలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా టెంపుల్ సిటీగా పేర్కొనే తిరుపతి పట్టణంలో చోటు చేసుకున్న షాకింగ్ ఉదంతం పెను సంచలనంగానే కాదు.. జీర్ణించుకోవటానికి కష్టంగా మారింది. ఎందుకుంటే.. దారుణ నేరం చేసిన మానస చదువుకున్నఅమ్మాయి కావటం.. అన్ని విషయాల మీద అవగాహన ఉన్నది కావటం. అసలేం జరిగిందంటే..

తిరుపతిలోని చిగురవాడకు చెందిన గోవింద్ కు మానసతో పెళ్లైంది. వారి వివాహం జరిగి కొన్ని నెలలు మాత్రమే అయ్యింది. అయితే.. ఆమెకు పెళ్లికి ముందు మరో వ్యక్తితో పరిచయం ఉంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ.. పెళ్లి మాత్రం జరగలేదు. దీంతో.. పెళ్లైనప్పటికీ ప్రియుడ్ని మర్చిపోలేని మానస.. లవ్వర్ తో కలిసి దారుణ ప్లాన్ వేసింది. తన భర్తను చంపేందుకు సిద్ధమైంది.

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇంట్లో నిద్ర పోతున్న గోవింద్ గొంతును నులుమేసిన ఆమె.. ఊపిరాడకుండా చేసి చంపేసింది. అనంతరం భర్త బంధువులకు ఫోన్ చేసి.. గోవింద్ కు అప్పులు ఎక్కువగా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కథ అల్లింది. అయితే.. గోవింద్ చనిపోవటానికి ముందు ఇంటికి ఒక యువకుడు వచ్చి వెళ్లటాన్ని సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. దీంతో.. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు.

దీంతో.. అసలు విషయం బట్టబయలైంది. తన ప్రియుడు కోసం భర్తను చంపేసినట్లుగా మానస ఒప్పుకుంది. దీంతో.. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లైన తర్వాత ప్రియుడ్ని మర్చిపోలేని పరిస్థితే ఉంటే.. ఆ విషయాన్ని భర్తను అడిగి.. విడాకులకు అప్లై చేసుకొని తన దారిన తాను వెళ్లాలే కానీ.. ఇలా అడ్డదిడ్డంగా చంపేయటం ద్వారా ఆమెసాధించేదేమీ లేదు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.