Begin typing your search above and press return to search.

ఏపీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది... ఆ ముగ్గురిపై షర్మిళ సెటైర్లు!

ఏపీలో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడంతో... రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి

By:  Tupaki Desk   |   22 April 2024 4:14 PM GMT
ఏపీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది... ఆ ముగ్గురిపై షర్మిళ సెటైర్లు!
X

ఏపీలో పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వడంతో... రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. ఇందులో భాగంగా... విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో నిన్నమొన్నటి వరకూ వైఎస్ జగన్ పై మాత్రమే బలంగా టార్గెట్ చేసినట్లు కనిపించిన షర్మిళ... బీజేపీతో పొత్తు అనంతరం చంద్రబాబుపైనా విమర్శలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కూడా తలుపు చెక్కా, తమలపాకు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

అవును... ఏపీలో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో... ఏపీ పీసీసీ చీఫ్ అయిన వైఎస్ షర్మిళ టీడీపీని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోకున్నా.. సింగిల్ గా పోటీ చేస్తున్నా.. జగన్ పైనా ఆమె బీజేపీతో అనధికారిక కనెక్షన్ కలిపి విమర్శలు గుప్పిస్తున్నారు! ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న వైఎస్ షర్మిళ... ఏపీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ సరికొత్త విమర్శలు తెరపైకి తెచ్చారు.

జగన్ కి మోడీకి.. జగన్ కీ బీజేపీ కి ఉన్న సంబంధం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బంధం మాత్రమే అని.. తాము ఇండియా కూటమిలో కానీ, ఎన్డీయే కూటమిలో కానీ భాగస్వాములు కామన్న విషయమే ఇందుకు నిదర్శనమని.. ప్రభుత్వాలు వేరు, పార్టీలు వేరంటూ వైసీపీ నేతలు చెబుతున్న సమయంలో... అటు జగన్, ఇటు చంద్రబాబు కూడా మోడీతో స్నేహం కోరుకుంటున్నారని షర్మిళ అంటున్నారు. ఇందులో ఒకరిది బహిరంగ స్నేహం, మరొకరిది అక్రమ స్నేహం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇందులో భాగంగా... ఏపీలో ప్రజలు ఇచ్చిన అధికారంతో జగన్.. మోడీతో కలిసి ప్రయాణిస్తున్నారని చెప్పిన షర్మిళ... అటు చంద్రబాబుకీ మోడీ కావాలి, ఇటు జగన్ కీ మోడీ కావాలంట అంటూ విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో... ఏపీలో చంద్రబాబు.. బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకుంటే... అదే బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని అన్నారు. ఈ సమయంలో మోడీ - చంద్రబాబు – జగన్ ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందంటూ షర్మిల ఎద్దేవా చేశారు.