Begin typing your search above and press return to search.

వయసు 65 ఏళ్లు.. జగిత్యాల జిల్లాలో బయటపడ్డ ఘోరం

వయసు మీదకు వచ్చినా.. చేసే ఛండాలాలకు కొదవ ఉండదు. అలాంటి ఉదంతమే తాజాగా జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది

By:  Tupaki Desk   |   13 Oct 2023 6:15 AM GMT
వయసు 65 ఏళ్లు.. జగిత్యాల జిల్లాలో బయటపడ్డ ఘోరం
X

వయసు మీదకు వచ్చినా.. చేసే ఛండాలాలకు కొదవ ఉండదు. అలాంటి ఉదంతమే తాజాగా జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. తాతా అంటూ చిన్నారులు ప్రేమతో పిలిచే వేళ.. అతగాడి దుర్మార్గాన్ని గుర్తించలేకపోయారు. జామకాయలు తినేందుకు వీధిలోని చెట్టు వద్దకు వెళితే.. ఆ చెట్టు పక్కే ఉన్న ఇంట్లో ఉండే దుర్మార్గుడు అత్యంత నీచానికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది.

జిగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని తిర్మలాపూర్ కు చెందిన 65 ఏళ్ల ముత్తయ్య ఉంటాడు. అదే గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లల తండ్రులు బతుకుదెరువు కోసం గల్ఫ్ కు వెళ్లగా.. తల్లులు పనులకు వెళుతుంటారు. వాళ్లు ఇంట్లో లేని సమయంలో పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. దగ్గర్లోని జామచెట్టు దగ్గర కాయలు కోసుకునేందుకు వెళ్లగా.. వారికి చాకెట్లు.. బిస్కెట్లు ఇస్తానని ఆశ చూపి లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడు.

ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెబితే ముగ్గురినీ చంపేస్తానంటూ వారిపై చేయి చేసుకున్నాడు. దీంతో.. ఆ ముగ్గురు బాలికలు భయంతో అతడు పెడుతున్న నరకాన్ని భరిస్తూ మౌనంగా ఉండిపోయారు. అప్పటి నుంచి అతగాడి దురాగతం మరింత పెరిగింది. చంపేస్తాడన్న భయంతో ఎవరికి చెప్పుకోలేదు. ఆదివారాలు.. బడికి సెలవులు ఉన్న సమయాల్లో తన పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టేవాడు.

మూడు రోజుల క్రితం బాలికలు అనారోగ్యానికి గురి కావటంతో ఆందోళన చెందిన వారి తల్లులు.. వారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వారిని పరీక్షించిన వైద్యులు.. చిన్నారుల్ని ప్రశ్నించగా అసలు ఘోరం బయటకు వచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లులు.. ముత్తయ్య ఇంటికి వెళ్లారు. గ్రామస్తులు సైతం తీవ్ర ఆగ్రహానికి గురి కావటంతో.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడ్ని బహిరంగంగా ఉరి తీయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘోర ఉదంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెను సంచనలంగా మారింది.