మేము అధికారంలోకి వచ్చి ఇలా మొదలుపెడితే ఎలా ఉంటుందో తెలుసా?
ఈ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ ప్రధాన కార్యదర్శి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 10 May 2025 9:00 PM ISTకూటమి ప్రభుత్వంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు నుంచి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే తీరు ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై నిప్పులు చెరిగారు.
మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జలను ఏపీ సీఐడీ విచారించింది. ఈ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ ప్రధాన కార్యదర్శి పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘దాడులకు మా నాయకుడు జగన్ వ్యతిరేకం. మాట్లాడే సమయంలో సంయమనంతో ఉండాలి. ఆ ఘటన జరిగిన సమయంలో నేను ఉళ్లో లేను. అధికారులు అడిగిన ప్రశ్నకి నాకేమీ తెలియదని సమాధానం చెప్పాను. ఏడాది కాలంగా రెడ్ బుక్ వేధింపులు ఎక్కువయ్యాయి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడం, వేధించడం జైలుకు పండమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నుంచి కిందస్థాయి వరకు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
తమ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, వీటిపై బాధితులుగా ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు తీసుకోవడం లేదని సజ్జల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీక్రుత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తోందని మండిపడ్డారు. మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాలం ఎప్పుడూ ఇలానే ఉండదు. రేసు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుందో తెలుసా? అంటూ ప్రశ్నించారు. మీరు అనుసరిస్తున్న విధానం కరెక్టు కాదంటూ ఆక్షేపించారు.
పోసాని ఎప్పుడో మాట్లాడితే కేసు పెట్టారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటికి ఎలాంటి లేకుండా పోలీసులు వెళ్లారు. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్నవారిని కూడా వదలడం లేదని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఉన్మాద చర్యలుగా ఎంతవరకు దారితీస్తాయో తెలుసా? అంటూ నిలదీశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలను సృష్టిస్తున్నట్లు చెప్పారు. ఏపీ లిక్కర్ స్కాం ఓ తప్పుడు కేసుగా ఆరోపించారు. ఇప్పటికైనా వాస్తవంలోకి రండి.. లేనిపక్షంలో ప్రజలు తిప్పికొట్టే పరస్థితి ఎదురవడం ఖాయం అంటూ హెచ్చరించారు.