Begin typing your search above and press return to search.

గతాన్ని తవ్వుతూ ఫ్యూచర్ చెబుత..చిరుకు రోజా మాస్‌ వార్నింగ్‌!

సినిమా వాళ్లు చెప్తే వినే స్థాయిలో లేమని రోజా ఫైరయ్యారు. అనంతరం ప్రజారాజ్యం రోజుల్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు రోజా.

By:  Tupaki Desk   |   9 Aug 2023 11:21 AM GMT
గతాన్ని తవ్వుతూ ఫ్యూచర్  చెబుత..చిరుకు రోజా మాస్‌  వార్నింగ్‌!
X

పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటూ ప్రభుత్వం చిరంజీవి చేసిన కామెంట్స్ చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన కామెంట్స్ కు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి రోజా చిరంజీవికి సవాల్ చేసారు. ఈ సందర్భంగా గతాన్ని తవ్వుతూ రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అవును... చిరంజీవి చేసిన పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వ్యాఖ్యలపై మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. చిరంజీవి చెబితే వినాల్సిన స్థితిలో జగన్ లేరని అన్నారు. తమ్ముడు పవన్ కోసం చిరంజీవి మాట్లాడి ఉంటారని.. గతంలో మెగా బ్రదర్స్ కలిసి వస్తేనే ప్రజలు తిరస్కరించారని గుర్తు చేసారు.

ఇదే సమయంలో సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదని మంత్రి రోజా హితవు పలికారు. చిరంజీవి సలహా ఇవ్వాలి అనుకుంటే ముందు అయన తమ్ముడికి ఇవ్వాలని సూచించారు. సినిమా వాళ్లు చెప్తే వినే స్థాయిలో లేమని రోజా ఫైరయ్యారు. అనంతరం ప్రజారాజ్యం రోజుల్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు రోజా.

అవును... పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి రాష్ట్రానికి ఏం చేసారని ఈ సందర్భంగా ప్రశ్నించిన రోజా... ఏపీకి ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా అని నిలదీసారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏమీ చేశారని ప్రశ్నించారు.

ఇదే సమయంలో జగన్ మీద నమ్మకం లేకపోతే సినిమా హీరోలు అందరినీ తీసుకొని సీఎం దగ్గరకు చిరంజీవి ఎందుకు వెళ్లినట్లని అడిగారు రోజా. ఈ సందర్భంగా... ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించటం లేదని చెప్పిన మంత్రి... ఏపీలో జగన్ పాలన ఎలా ఉందో ప్రతీ గడపకు వెళ్తే తెలుస్తుందని సూచించారు.

ఇదే సమయంలో జగన్ పాలనపై చర్చకు తాను సిద్దమని చిరంజీవికి సవాల్ చేసారు. అదేవిధంగా... రాజ‌కీయాలే చేయాల‌ని అనుకుంటే ఆ రంగంలో వుండి చేయాల‌ని ఆమె స‌వాల్ విసిరారు. అలాగే సినిమాలు చేయాల‌ని అనుకుంటే రాజ‌కీయాల జోలికి రాకుండా వాటినే చేసుకోవాల‌ని రోజా హిత‌వు చెప్పారు.

అనంతరం... చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా మరోసారి తిరస్కరణ తప్పదని రోజా జోస్యం చెప్పడం గమనార్హం!