Begin typing your search above and press return to search.

రిషికొండ నిర్మాణాలపై తాజా ట్వీట్ తో ఫుల్ క్లారిటీ

By:  Tupaki Desk   |   13 Aug 2023 7:47 AM GMT
రిషికొండ నిర్మాణాలపై తాజా ట్వీట్ తో  ఫుల్ క్లారిటీ
X

రిషికొండపై అక్రమ నిర్మాణాలంటూ చేస్తున్న విపక్షాల ప్రచారానికి చెక్ పెట్టేసింది అధికార పార్టీ. తాజాగా రిషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించిన ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తాజాగా చేసిన ట్వీట్ తో రిషికొండ మీద నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించింది. రుషికొండ మీద నిర్మిస్తున్నది సచివాలయమని పేర్కొంది.

ఏపీ రాష్ట్ర సచివాలయం కోసమే రుషికొండ మీద భవనాల్ని నిర్మిస్తున్నట్లుగా చెప్పిన వైసీపీ.. రుషికొండపై జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ సర్కారు వెల్లడించిన వేళ.. అందుకు తగ్గట్లే రుషికొండ మీద రాష్ట్ర సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనిపై తెలుగుదేశంతో పాటు.. జనసేన అధినేత విష ప్రచారం చేస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత రుషికొండ మీద ఏదో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా పేర్కొంటూ.. సందర్శన అంటూ హడావుడి చేయటం.. రుషికొండ మీద నిర్మాణాల మీద తనకు తోచినట్లుగా మాట్లాడటం తెలిసిందే. అయితే.. ఆ వాదనలో నిజం లేదని.. అక్కడ సచివాలయ భవనాల్ని నిర్మిస్తున్న వివరాల్ని వెల్లడించటం ద్వారా.. తప్పుడు ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడేలా చేసింది. అయితే.. ఈ విషయాన్ని మరింత ముందుగా వివరించి ఉంటే ప్రతిపక్షాలకు అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.