Begin typing your search above and press return to search.

యూఎస్ లో భార్యను చంపి పరారైన ఇండియన్ పై రూ.2 కోట్ల రివార్డు!

దీంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) రంగంలోకి దిగింది.

By:  Tupaki Desk   |   14 April 2024 3:45 AM GMT
యూఎస్  లో భార్యను చంపి పరారైన ఇండియన్ పై రూ.2 కోట్ల రివార్డు!
X

ఇటీవల కాలంలో అమెరికాలోని భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయని.. వివిద్ఘ ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక దారుణ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... అమెరికాలోని ఒక భారతీయుడు తన భార్యను అత్యంత దారుణంగా చంపి పరారైపోయాడు. దీంతో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) రంగంలోకి దిగింది.

అవును... యూఎస్ లో భార్యను అత్యంత కిరాతకంగా చంపిన ఒక భారతీయుడు పరారైపోయాడు. దీంతో... అతడి కోసం ఎఫ్.బి.ఐ. ముమ్మరంగా గాలిస్తోంది. ఈ సమయంలో... నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 2,50,000 డాలర్లు ఇస్తామని వెల్లడించింది. అంటే.. భారత కరెన్సీలో సుమారు రూ.2 కోట్లకు పైమాటే అన్నమాట.

వివరాళ్లోకి వెళ్తే... యూఎస్ లో భద్రేశ్‌ కుమార్‌ చేతన్‌ భాయ్‌ పటేల్‌, అతడి భార్య పాలక్‌ మేరీల్యాండ్‌ లోని హానోవర్‌ లో ఉండే ఓ డోనట్‌ దుకాణంలో పని చేసేవారు. ఈ సమయంలో హత్య జరిగిన 2015 ఏప్రిల్‌ 12న వీరిద్దరూ నైట్‌ షిఫ్ట్‌ లో ఉన్నారు. ఈ సమయంలో ఆ దుకాణంలోని కిచెన్‌ లో పనిచేస్తున్న పాలక్‌ దగ్గరకు అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్లిన భద్రేశ్ కుమారు... ఆమెపై పలుమార్లు కత్తితో పొడిచాడు.

అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. దీంతో... తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హత్య అనంతరం తన అపార్ట్‌ మెంట్‌ కు వచ్చిన భద్రేశ్‌ కుమార్ కొన్ని వస్తువులు తీసుకుని న్యూజెర్సీ విమానాశ్రయానికి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కన్పించింది. ఆ తర్వాత అతడి జాడలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎఫ్‌.బీ.ఐ. అధికారులు.. నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు.

అయితే అప్పటినుంచి నిందితుడి కోసం గాలిస్తున్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. 2017లో అతడిని టాప్‌ టెన్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే తాజాగా అతడిపై రివార్డు ప్రకటించింది. నిందితుడు కెనడా పారిపోయి ఉంటాడని లేదా భారత్‌ కు తిరిగి వెళ్లి ఉండొచ్చని ఎఫ్.బి.ఐ. అధికారులు అనుమానిస్తున్నారు.

వీసా గడువు తీరడంతో ఆమె భారత్‌ తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో.. ఇది నచ్చని ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారని చెబుతున్నారు!