Begin typing your search above and press return to search.

నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల... గెలిచిన ఏపీ ప్రభుత్వ పంతం?

ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 9:02 AM GMT
నాగార్జున సాగర్  నుంచి నీటి విడుదల... గెలిచిన ఏపీ ప్రభుత్వ పంతం?
X

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఊహించని స్థాయిలో నాగార్జునా సాగర్ ప్రాజెక్ట్ వద్దకు చేరిన ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటాక డ్యాం కు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు 26 గేట్లలో సగ భాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం పంతం నెగ్గించుకుందని అంటున్నారు!

అవును... నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం పంతం నెగ్గించుకుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మోటార్లకు సెపరేట్‌ గా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి.. డ్యాం నుంచి కుడి కాలువకు అధికారులు గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో 5వ గేట్ నుంచి సుమారు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలుస్తుంది.

కాగా... ఇవాళ తెల్లారుజాము నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ వద్ద ఊహించని హైడ్రామా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అర్దహరాత్రి ప్రాజెక్ట్‌ పై పెద్దఎత్తున ఏపీఎస్పీ బలగాలను మోహరించిన ఏపీ ప్రభుత్వం... ఆంధ్రా భూభాగంలో ఉన్న గేట్లను కంట్రోల్‌ లోకి తీసుకుంది. ఇందులో భాగంగా... 26 గేట్లలో 13 గేట్లను స్వాధీనం చేసుకుంది.

ఈ సందర్భంగా ఏపీ చర్యలను తెలంగాణ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 13వ గేటు దగ్గర పెట్టిన బారికేడ్లు, ముళ్ల కంచెలను తొలగించాలని కోరారు. అయితే, 26 గేట్లలోనూ 13 గేట్లు తమ పరిధిలోకి వస్తాయని ఏపీ అధికారులు గట్టిగా చెప్పారు! దీంతో అర్ధరాత్రి నుంచి ప్రాజెక్ట్‌ పైన హైడ్రామా కొనసాగింది.

వాస్తవానికి కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశాల ప్రకారం నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది! దీంతో... నీటి విడుదల, భద్రతా విషయంలో ఇప్పటివరకూ ఇదే కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో... తాజాగా ఏపీ అధికారులు తమ పరిధిలోకి వచ్చే 13 గేట్లు స్వాధీనం చేసుకుంటూ డ్యాం మధ్యలో ముళ్లకంచె వేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ రోజు ఉదయం పోలింగ్‌ మొదలవడానికి కొద్దిగంటల ముందు ఈ సంఘటన జరగడంతో ప్రాజెక్ట్‌ పై తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.