పరారీలో ఆర్సీబీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ మీనన్ ..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వైస్ ప్రెసిడెంట్ , హెడ్ రాజేష్ మీనన్ పోలీసుల దర్యాప్తు కు దొరకకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం
By: Tupaki Desk | 6 Jun 2025 2:58 PMరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వైస్ ప్రెసిడెంట్ , హెడ్ రాజేష్ మీనన్ పోలీసుల దర్యాప్తు కు దొరకకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి శంకర్, ట్రెజరర్ జయరామ్ లతో కలిసి ఆయన ఒకే వాహనంలో పారిపోయినట్టు సమాచారం.
పోలీసులు బెంగళూరులోని వీరి నివాసాలపై సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన కొద్ది నిమిషాల ముందు వీళ్లు తలుపు దించి పారిపోయినట్టు పోలీసుల సమాచారం.
ఈ ముగ్గురిపై కొంతకాలంగా ఆర్థిక అక్రమాలు, అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో సంబంధమైన నిధుల వాడకంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ప్రత్యేక బృందం వీరి ఆస్తులపై దాడులు జరిపేందుకు సిద్ధమవుతుండగా ముందస్తు సమాచారం లభించడంతో వీరు పారిపోయారు.
ఈ ఘటన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA)లో భారీ కలకలం రేపింది. ఆర్సీబీ యాజమాన్యం ఇప్పటివరకు ఈ ఘటనపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు. మరోవైపు, పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కానీ వేదికలపై జరుగుతున్న అనైతిక చర్చలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది.
ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, రాజేష్ మీనన్ సహా ఇతర ఇద్దరు ప్రముఖులు పారిపోవడం వెనుక కీలక ఆధారాలు దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.