Begin typing your search above and press return to search.

బాబు లోకేష్ తరువాత ఆయనేనా ?

అయితే ఇందులో ఎందరు సక్సెస్ అవుతున్నారు అంటే అది కూడా చూడాల్సి ఉంది. అయితే టీడీపీ వారసులు కూడా బాబు డైరెక్షన్లో బాగానే సక్సెస్ అవుతున్నారని చెప్పాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   3 May 2025 10:30 PM
బాబు లోకేష్ తరువాత ఆయనేనా ?
X

తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ విశ్వవిద్యాలయంగానే చెప్పాలి. అందులో నుంచి ఎందరో నాయకులు పుట్టారు. ఎంతో కీలకంగా ఎదిగారు. టీడీపీ లీడర్స్ బ్రహ్మాండంగా తయారు చేసే ఫ్యాక్టరీ అన్న చంద్రబాబు మాటలలో నూరు శాతం సత్యం ఉంది. ఆ వరసలో కీలక నేతల వారసులు కూడా రాజకీయం అందుకుంటున్నారు.

అయితే ఇందులో ఎందరు సక్సెస్ అవుతున్నారు అంటే అది కూడా చూడాల్సి ఉంది. అయితే టీడీపీ వారసులు కూడా బాబు డైరెక్షన్లో బాగానే సక్సెస్ అవుతున్నారని చెప్పాల్సి ఉంది. అందులో అగ్రభాగాన కింజరాపు వారి వారసుడు ఉన్నారు. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు అయిన రామ్మోహన్ నాయుడు వారసుడుగా అడుగు పెట్టినా తండ్రిని మించిన తనయుడిగా రుజువు చేసుకుంటునారు.

గట్టిగా నాలుగు పదుల వయసు లేదు కీలకమైన కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంతే కాదు పార్టీలో ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీలో చంద్రబాబు లోకేష్ తరువాత మూడవ పేరు కచ్చితంగా రామ్మోహన్ దే వినిపిస్తోంది.

ఇక ఢిల్లీ స్థాయిలో ఆయన టీడీపీ హవాను చాటుతున్నారు. కేంద్రం నుంచి నిధులను సాధించి పెట్టడంతో పాటుగా కేంద్రం ప్రకటించిన కార్యక్రమాలను ఏపీకి చేరువ చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే కేంద్ర మంత్రుల నుంచి కేంద్ర పెద్దల దాకా అపాయింట్మెంట్లు తీసుకుని ఆయన టూర్ ని సక్సెస్ చేయడంలో రామ్మోహన్ అతి ముఖ్య భూమికను పోషిస్తున్నారు అని అంటున్నారు.

రామ్మోహన్ కి నిబద్ధత ఉంది. అలాగే పనితీరులో జోరు ఉంది. తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉంది. అందుకే ఆయన మోడీ సభలలో అనువాదకుడిగా మారి పెద్దాయన ప్రశంసలు అందుకున్నారు. అమరావతి సభలో మోడీ మాట్లాడిన ప్రతీ మాటకు పూర్తిగా తెలుగులో అనువదించి ప్రధాని మనసులోని మాటలను జనాలకు చేర్చడంతో రామ్మోహన్ సెంట్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు.

మరో వైపు చూస్తే ఆయన పట్ల అటు చంద్రబాబు కానీ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారు. చిన్న వయసులో ఉన్నత పదవులు అందుకోవడమే కాదు వాటిని సమర్థంగా నిర్వహిస్తున్న రామ్మోహన్ కి ఎంతో భవిష్యత్తు ఉందని అంతా భావిస్తున్నారు. ఇక చంద్రబాబు అయితే లోకేష్ తరువాత అంతటి ప్రాధాన్యత రామ్మోహన్ కి ఇస్తున్నారు. రామ్మోహన్ ని తన టీం లో కీలక స్థానంలో ఉంచుతున్నారు లోకేష్.

ఇలా అన్ని విధాలుగా చూస్తే రామ్మోహన్ బాగా జోరు చూపిస్తున్నారు. ఆయన అనూహ్యంగా టీడీపీలో అగ్ర స్థానం లోకి వెళ్తున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీని ఆయన తానే అన్ని అయి నడిపిస్తున్నారు. రామ్మోహన్ ఢిల్లీలో ఉంటే చాలు అన్న భరోసా అయితే పార్టీ పెద్దలలో ఉంది.

బాగా పనిచేసిన నేతలను చంద్రబాబు ఎపుడూ ఇష్టపడతారు. అలా చూసుకుంటే కనుక రామ్మోహన్ టీడీపీకి తిరుగులేని నాయకుడిగా ఆయన కూడా భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర కు చెందిన ఈ బీసీ నేత పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతున్నారు అని అంటున్నారు. చంద్రబాబుకు ఆనాడు ఎర్రన్నాయుడు మాదిరిగా రేపటి రోజున లోకేష్ కి రామ్మోహన్ ఉంటారని కూడా చెబుతున్నారు ఏది ఏమైనా అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్న రామ్మోహన్ కి రాజకీయంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని అంటున్నారు.