Begin typing your search above and press return to search.

ఈ ఏడాది రాజ్యసభలో 68 మంది ఎంపీ సీట్లు ఖాళీ!

ఈ ఏడాది పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభలో 68 మంది ఎంపీల పదవీ కాలం ముగియనుంది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 4:42 AM GMT
ఈ ఏడాది రాజ్యసభలో 68 మంది ఎంపీ సీట్లు ఖాళీ!
X

ఈ ఏడాది పార్లమెంటులోని ఎగువ సభ అయిన రాజ్యసభలో 68 మంది ఎంపీల పదవీ కాలం ముగియనుంది. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మొత్తం మీద ఆరుగురి పదవీ కాలం పూర్తి కానుంది.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కు చెందిన జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ రవిచంద్ర వద్దిరాజు, బి.లింగయ్య యాదవ్‌ తెలంగాణ నుంచి పదవీ విరమణ చేస్తున్న సభ్యులు. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ కనీసం ఇద్దరిని రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపాలని ఆశిస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌æకి చెందిన టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం నుంచి పదవీ విరమణ చేస్తున్నారు.

తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా 68 మంది రాజ్యసభ సభ్యులు ఈ ఏడాది తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు, ఈ 68 ఖాళీలలో ఢిల్లీలోని మూడు స్థానాలకు ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడింది. ఇక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేతలు సంజయ్‌ సింగ్, నారాయణ్‌ దాస్‌ గుప్తా, సుశీల్‌ కుమార్‌ గుప్తాలు జనవరి 27న పదవీకాలం పూర్తి చేసుకోనున్నారు. అలాగే సిక్కింలోని ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికల ప్రకటన వెలువడింది. సిక్కిం డెమోక్రటిక్‌ పార్టీ (డీఎఫ్‌) సభ్యుడు హిషే లచుంగ్పా ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు.

ఇక కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవీయ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా 57 మంది నేతల పదవీకాలం ఏప్రిల్‌ లో పూర్తవుతుంది.

కాగా రాజ్యసభలో ఈ ఏడాది ఖాళీ అయ్యే సీట్లలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ లో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర, బీహార్‌ లలో ఆరు చొప్పున, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ లలో ఐదు చొప్పున, కర్ణాటక, గుజరాత్‌ లలో నాలుగు చొప్పున, ఒడిశా, తెలంగాణ, కేరళ, ఆంధ్ర ప్రదేశ్‌ లలో మూడు చొప్పున, జార్ఖండ్, రాజస్థాన్‌ లలో రెండు చొప్పున, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, హర్యానా మరియు ఛత్తీస్‌ గఢ్‌ లలో ఒక్కొక్కటి చొప్పున ఖాళీ కానున్నాయి. నలుగురు నామినేటెడ్‌ సభ్యులు కూడా జూలైలో పదవీ విరమణ చేస్తున్నారు.

పదవీ విరమణ చేస్తున్న సభ్యులలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌ (రాజస్థాన్‌), అశ్విని వైష్ణవ్, మన్సుఖ్‌ మాండవీయ, పర్షోత్తమ్‌ రూపాలా, బిజూ జనతాదళ్‌ (బీజేడీ) సభ్యులు ప్రశాంత నందా, అమర్‌ పట్నాయక్‌ (ఒడిశా), బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి అనిల్‌ బలూని (ఉత్తరాఖండ్‌), కాంగ్రెస్‌ సభ్యుడు నరన్‌ భాయ్‌ రత్వా ఉన్నారు.

గుజరాత్‌ కు చెందిన అమీ యాగ్నిక్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్, కాంగ్రెస్‌ సభ్యుడు కుమార్‌ కేత్కర్, ఎన్‌సీసీ సభ్యుడు వందనా చవాన్, శివసేన పార్టీ సభ్యుడు అనిల్‌ దేశాయ్‌ తదితరులు కూడా పదవీ విరమణ చేయనున్నారు.

మధ్యప్రదేశ్‌ నుండి, ధర్మేంద్ర ప్రధాన్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్, బిజెపి సభ్యులు అజయ్‌ ప్రతాప్‌ సింగ్, కైలాష్‌ సోనీ, కాంగ్రెస్‌ సభ్యుడు రాజమణి పటేల్‌ పదవీ కాలం ముగుస్తుంది.

అలాగే కర్ణాటకలో బీజేపీకి చెందిన రాజీవ్‌ చంద్రశేఖర్, కాంగ్రెస్‌కు చెందిన ఎల్‌ హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌ రిటైర్‌ అవుతున్నవారిలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు అబిర్‌ రంజన్‌ బిస్వాస్, సుభాసిష్‌ చక్రవర్తి, మహమ్మద్‌ నడిముల్‌ హక్, శాంతాను సేన్, కాంగ్రెస్‌ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వీల పదవీ కాలం ముగియనుంది.

అలాగే బీహార్‌ లో ఆర్జేడీ సభ్యులు మనోజ్‌ కుమార్‌ ఝా, అహ్మద్‌ అష్ఫాక్‌ కరీం, జేడీ(యూ) సభ్యులు అనీల్‌ ప్రసాద్‌ హెగ్డే, బశిష్ట నారాయణ్‌ సింగ్, బీజేపీ సభ్యుడు సుశీల్‌ కుమార్‌ మోదీ, కాంగ్రెస్‌ సభ్యుడు అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌ రాజ్యసభ పదవీకాలం పూర్తి చేస్తున్నారు.

బీజేపీ సభ్యులు అనిల్‌ అగర్వాల్, అశోక్‌ బాజ్‌పాయ్, అనిల్‌ జైన్, కాంత కర్దమ్, సకల్‌దీప్‌ రాజ్‌భర్, జీవీఎల్‌ నరసింహారావు, విజయ్‌ పాల్‌ సింగ్‌ తోమర్, సుధాంశు త్రివేది, హరనాథ్‌ సింగ్‌ యాదవ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌ వాదీ పార్టీ సభ్యురాలు జయా బచ్చన్‌లు పదవీ విరమణ చేస్తున్నారు.

బిజెపి సభ్యులు సరోజ్‌ పాండే, డిపి వాట్స్‌ వరుసగా ఛత్తీస్‌ గఢ్, హర్యానా నుండి పదవీ విరమణ చేస్తున్నారు.

జార్ఖండ్‌లో, బిజెపి సభ్యుడు సమీర్‌ ఒరాన్, కాంగ్రెస్‌ సభ్యుడు ధీరజ్‌ ప్రసాద్‌ సాహు మేలో పదవీ విరమణ చేస్తున్నారు.

కేరళలో సీపీఐ(ఎం) సభ్యుడు ఎలమరం కరీం, సీపీఐ సభ్యుడు బినోయ్‌ విశ్వం, కేసీ(ఎం) సభ్యుడు జోస్‌ కె మణి జూలైలో పదవీ విరమణ చేస్తున్నారు.

జూలైలో పదవీ విరమణ చేయనున్న నామినేటెడ్‌ సభ్యులలో మహేశ్‌ జెఠ్మలానీ, బీజేపీకి చెందిన సోనాల్‌ మాన్‌సింగ్, రామ్‌ షకల్, రాకేష్‌ సిన్హా ఉన్నారు.