సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్.. అమరావతి టు ఎనీవేర్!
ఆయా సంస్థలు.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉందని తాజా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
By: Tupaki Desk | 31 May 2025 10:30 PMఇప్పటి వరకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు. ఎక్కడెక్కడికోవెళ్లి.. నేర్చుకునే కీలకమైన క్వాంటమ్ టెక్నాల జీ ఇక, ఏపీ రాజధాని అమరావతిలోనే రానుంది. అది ఎంతో దూరంలో కూడా లేదు. మరో 7 మాసాల్లో జనవరి 1వ తేదీ నుంచి దీనిని ప్రారంభించనున్నారు. ఇక్కడ క్వాంటంకు సంబంధించిన పలు ప్రాజెక్టు లు ఏర్పడనున్నాయి. అటు కంప్యూటర్ రంగానికి, ఇటు వైద్య రంగానికి కూడా క్వాంటం పరిజ్ఞానం అవసరం అవుతోందన్న విషయంతెలిసిందే.
వైద్య పరంగా స్కానింగుల నుంచి కంప్యూటర్లు, టెక్నాలజీ పరంగా కూడా క్వాంటం పరిజ్ఞానం.. సాంకేతికత కూడా నేడు అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో క్వాంటం టెక్నాలజీ నేర్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనినిదృష్టిలో పెట్టుకున్నకూటమి ప్రబుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మూడు ప్రముఖ సంస్థలతో కూడా ఆయన ఒప్పందం చేసుకున్నారు.
ఆయా సంస్థలు.. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉందని తాజా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. `క్యాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంవోయూ`ను ర్యాటిఫై చేసింది. ప్రఖ్యాత టీసీఎస్, ఎల్అండ్టీ, ఐబీఎం సంస్థలు క్వాంటం వ్యాలీలో కీలక రోల్ పోషించనున్నాయి. క్వాంటం సిస్టం-2ను ఏర్పాటు చేయనున్నారు.
తద్వారా ఎక్కడెక్కడకో వెళ్లి క్వాంటంపై పరిజ్ఞానం పెంచుకునే యువత.. ఇక నుంచి అమరావతి కేంద్రంగానే పరిజ్ఞానాన్ని సముపార్జించుకునే అవకాశం మెరుగు పడనుంది. తద్వారా.. దేశానికే కాదు.. ప్రపంచానికి కూడా అమరావతి కీలక క్వాంటం వ్యాలీగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏయే సంస్థలు ఎలా ఎలా?
+ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవలను అందించనుంది.
+ అదేవిధంగా క్వాంటం పరిశోధన, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్ సేవలను కూడా అందించనున్నాయి.
+ క్లెంట్ నెట్వర్క్, స్టార్టప్ల నిర్వహణకు నైపుణ్యాలను అందిస్తాయి.