మహిళతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్.. రచ్చ
పంజాబ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఓ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
By: Tupaki Desk | 19 Jun 2025 4:00 PM ISTపంజాబ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఓ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రవ్జోత్ సింగ్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో లీకయ్యాయి. శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ ఈ ఫొటోలను ఎక్స్ ప్లాట్ఫామ్లో షేర్ చేయడంతో ఈ వివాదం రాజకీయ దుమారాన్ని రేపింది.
-మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్
బిక్రమ్ సింగ్ ఈ ఫొటోలతో పాటు ఒక పోస్టు చేశారు. అందులో, ‘‘ఆప్ ప్రభుత్వంలోని మంత్రి రవ్జోత్ సోదరీమణుల గౌరవానికి భంగం కలిగించారు. ప్రభుత్వం వెంటనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ పోస్టుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లను ట్యాగ్ చేశారు.
-ఫోటోలు నకిలీవి... రాజకీయ కుట్ర : మంత్రి స్పందన
ఈ వివాదంపై మంత్రి రవ్జోత్ సింగ్ వెంటనే స్పందించారు. ‘‘వీటన్నీ ఏఐ సాయంతో తయారుచేసిన నకిలీ ఫోటోలు. రాజకీయంగా నన్ను పరాభవ పరిచే ప్రయత్నమే కాదు... ఓ మహిళ గౌరవాన్ని కూడా దిగజార్చే పని చేశారు. సమాజంలో మహిళల పట్ల వారికి గల గౌరవం ఎంతటిదో ఈ సంఘటన చూపించింది. లూథియానా ఉపఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారు’’ అని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా వెల్లడించారు. తన మాజీ భార్యతో ఉన్న వ్యక్తిగత చిత్రాలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దళిత కుటుంబానికి చెందిన వాడిని కావడంతో తనను టార్గెట్ చేశారని కూడా ఆయన అన్నారు.
-మంత్రికి పార్టీ మద్దతు
ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ అమన్ అరోరా స్పందిస్తూ, మంత్రికి పూర్తి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ‘‘అకాలీదళ్ మురుగు రాజకీయాలకు దిగజారింది. వీటి ద్వారా ప్రజలను మభ్యపెట్టాలనుకుంటోంది’’ అని విమర్శించారు.
-విపక్షాల ఆగ్రహం.. అధికార పక్ష రక్షణ
ఈ ఫొటోలు నిజమైనవా? నకిలీనా? అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ ఈ వ్యవహారం పంజాబ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. లూథియానా ఉపఎన్నికల నేపథ్యంలో ఈ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అధికార పక్షం దీనిని నిఖార్సైన కుట్రగా అభివర్ణిస్తుండగా, విపక్షాలు మాత్రం మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
మొత్తానికి ఈ వివాదం పంజాబ్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా ఆరోపణలు, ప్రతిఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత పెరుగుతున్నది. అధికార, విపక్షాల మధ్య ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.
