రాజకీయాల్లోకి లాగొద్దు.. టాప్ హీరోయిన్ ఆవేదన
ప్రీతిని రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించగా తన స్పందన ఇలా ఉంది. ''సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తుల సమస్య అదే.. అందరూ డెసిషన్ మేకర్స్ గా మారుతున్నారు.
By: Tupaki Desk | 29 April 2025 10:30 AMసొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా దాదాపు 7 సంవత్సరాల విరామం తర్వాత పెద్ద తెరపై తిరిగి కనిపించడానికి సిద్ధంగా ఉంది. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో 'లాహోర్ 1947' చిత్రంలో సన్నీ డియోల్, షబానా అజ్మీ ,అలీ ఫజల్ లతో కలిసి నటించనుంది. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు.
ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఒక అభిమాని ప్రీతీని తీవ్రంగా హర్ట్ చేసాడు. ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ లో ప్రీతిని అతడు మీరు బీజేపీలో చేరుతున్నారా? అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ప్రీతి హఠాత్తుగా అతడిపై విరుచుకుపడింది. తనపై తీర్పు చెప్పే ప్రజల విషయంలో ప్రీతి తన నిరాశను దాచుకోలేకపోయింది. అతడి ప్రశ్నకు ప్రీతి ఒక రోజు గ్యాప్ తర్వాత ఎక్స్ ఖాతాలో సరైన సమాధానం ఇచ్చింది. ప్రీతి తన వైఖరిని ఈ సమాధానంలో స్పష్ఠం చేసింది.
ప్రీతిని రాజకీయాల్లోకి వస్తున్నారా? అని ప్రశ్నించగా తన స్పందన ఇలా ఉంది. ''సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తుల సమస్య అదే.. అందరూ డెసిషన్ మేకర్స్ గా మారుతున్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, ఒక ఆలయానికి లేదా మహా కుంభానికి వెళ్లి నేను ఎవరో .. నా గుర్తింపు గురించి గర్వపడటం చూసి రాజకీయాల్లో చేరుతున్నానని.. బిజెపిలో చేరానని అనడం సరికాదు. భారతదేశం వెలుపల నివసించడం వల్ల నా స్వదేశం విలువ ఏమిటో నాకు అర్థమైంది. అందరిలాగే నేను భారతదేశాన్ని, భారతీయులందరినీ ఇప్పుడు ఎక్కువగా అభినందిస్తున్నాను'' అని అన్నారు.
అయితే ప్రీతి ఎక్స్ ఖాతాలో సారీ చెబుతూ ఈరోజు ఇలా రాసారు. ''నేను అకస్మాత్తుగా అరిచి ఉంటే క్షమించండి! ఈ ప్రశ్నతో ఒక సమస్య ఉంది. మీకు ధన్యవాదాలు. తల్లి అయ్యి విదేశాలలో నివసించిన తర్వాత, నా పిల్లలు సగం భారతీయులు అని మర్చిపోకుండా చూసుకోవాలనుకుంటున్నాను. నా భర్త అజ్ఞేయవాది కాబట్టి మేము మా పిల్లలను హిందువులుగా పెంచుతున్నాము. విచారకరమైన విషయం ఏమిటంటే, నేను నిరంతరం విమర్శలను ఎదుర్కొంటున్నాను. నా ఎంపికను ఎల్లప్పుడూ రాజకీయం చేయడంతో నేను ఈ సాధారణ ఆనందాన్ని కూడా కోల్పోతున్నాను. నేను ఎవరో లేదా నా పిల్లలకు వారి మూలాలు, మతం గురించి నేర్పించడంలో గర్వంగా ఉన్నానని నేను భావిస్తున్నాను. ముందుకు సాగడానికి చాలా సమయం ఉంది ... మీకు చాలా ప్రేమ.. శుభాకాంక్షలు'' అని ప్రీతి రాసారు. ప్రీతి జింతా 2016లో విదేశీ ప్రియుడు జీన్ గూడెనఫ్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట సరోగసీలో గియా, జై అనే కవలలకు జన్మనిచ్చారు. 11 నవంబర్ 2021న పిల్లల్ని సరోగసీ ద్వారా స్వాగతించారు.