Begin typing your search above and press return to search.

ఒరేయ్ కొడతా.. ఆగ్రహంతో ఊగిపోయిన కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధినేత..నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కేఏ పాల్ కు కోపమొచ్చింది

By:  Tupaki Desk   |   25 Aug 2023 6:02 AM GMT
ఒరేయ్ కొడతా.. ఆగ్రహంతో ఊగిపోయిన కేఏ పాల్
X

ప్రజాశాంతి పార్టీ అధినేత..నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కేఏ పాల్ కు కోపమొచ్చింది. అది కూడా అలాంటి ఇలాంటి కోపం కాదు. ఆవేశంతో ఊగిపోతూ.. బ్యాలెన్స్ మిస్ అయిన ఆయన తీరుకు అక్కడి వారు ఆశ్చర్యపోగా.. అధికారి ఒకరు అంతే ధీటుగా రియాక్టు అయిన తీరు సంచలనంగా మారింది. అమీర్ పేటలోని ప్రజాశాంతి పార్టీ ఆఫీసు ముందు రోడ్డును తవ్వే పనిని చేపట్టగా.. పాల్ కు కోపం వచ్చింది. గుంత తవ్విన కాంట్రాక్టర్ మీద ఇంతెత్తున లేచారు.

తాను ఉంటున్న ఇంటి ముందు రోడ్డు తవ్వొద్దని చెబితే ఎందుకు తవ్వారన్న ఆయన.. 'ఇక్కడ రోడ్డు తవ్వొద్దని ఇంజినీర్లు.. మేయర్ చెప్పారు కదా? ఎందుకు తవ్వావు?జస్ట్ గెట్ అవుట్.. లేదంటే మేమే గెంటేస్తాం' అంటూ ఆర్ బీఏకు చెందిన అధికారిపై పాల్ ఆవేశంతో ఊగిపోగా.. అందుకు ఆ ఉద్యోగి ధీటుగా బదులిచ్చారు. 'ఫస్ట్ సరిగా మాట్లాడండి. నా దగ్గర ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి' అని చెప్పటంతో.. దీనికి అసహనం వ్యక్తం చేసిన కేఏ పాల్.. ఇక్కడ రోడ్డు తవ్వొద్దని ఇంజినీర్లు.. మేయర్ నీ ముందే చెప్పారుగా? అంటూ ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా మరో వ్యక్తితోనూ కేఏ పాల్ వాదనకు దిగారు. ఒక దశలో పూర్తిగా సహనం కోల్పోయిన ఆయన.. ''ఒరేయ్ కొడతాను. నిన్ను కొడతాను. ఇక్కడ రోడ్డు తవ్వొద్దని ఇంజినీర్లు అందరూ వచ్చి చెప్పారు. అయినా రోడ్డు తవ్వుతావా? ఇక్కడ ఇన్ని కార్లు ఉన్నాయి. రోడ్డు తవ్వొద్దని మేయర్ ను అడిగాం. ఒప్పుకున్న తర్వాత తవ్వుతారా?'' అంటూ ఆవేశానికి గురయ్యారు. అవసరానికి మించి రియాక్టు అయిన కేఏ పాల్ తీరు అక్కడి వారిని విస్మయానికి గురయ్యేలా చేసింది.