Begin typing your search above and press return to search.

బాబు సొమ్ము వాళ్ళ పాలు...అందుకే జైలు...!

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని ఒక సామెత ఉందని అలా బాబు పాపపు సొమ్ము అంతా లాయర్ల పాలు అవుతోదని పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 1:18 PM GMT
బాబు సొమ్ము  వాళ్ళ పాలు...అందుకే జైలు...!
X

టీడీపీ అధినేత జైలు జీవితంతో టీడీపీ ప్రాణ సంకటంగా మారింది. బాబు లేని టీడీపీ జోరు లేని బండి అయింది. టీడీపీ ప్రతీ రోజూ దీని మీద వైసీపీ ప్రభుత్వంతోనే ఢీ కొంటోంది. కక్ష సాధింపుతోనే చంద్రబాబుని జైలులో పెట్టారని విమర్శిస్తోంది. దీని మీద మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ బాబు అపారమైన మేధస్సులో 19 కేసులలో స్టేలు తెచ్చుకున్నారని వెటాకారమాడారు.

నడిచిపోతే అన్నీ మంచి రోజులే. కానీ కాలం మారింది అందుకే బాబు జైలులో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని ఒక సామెత ఉందని అలా బాబు పాపపు సొమ్ము అంతా లాయర్ల పాలు అవుతోదని పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. ఎంత మంది పెద్ద లాయర్లను తెచ్చి వాదించినా బాబుకు కేసులలో ఉపశమనం లభించకపోవడం వెనక కారణం టీడీపీ నేతలు ఆలోచించాలని ఆయన సూచించారు. ఏ ఆధారాలు లేకుండా బాబుని జైలులో ఎందుకు ఉంచుతారు. ఇంత చిన్న లాజిక్ ని మిస్ అయితే ఎలా తమ్ముళ్ళూ అని పేర్ని నాని అంటున్నారు.

బాబు రిమాండ్ ఖైదీగా ఉంటే జైలు గోడల మధ్యన ఉంటే దానికీ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం అని పేర్ని నాని నిలదీశారు. అరెస్ట్ చేయడం సీఐడీ చేసిందని, అది కూడా ఈ కేసులో ఈడీ జీఎస్టీ, ఐటీ డిపార్ట్మెంట్ అన్నీ విచారించి అవినీతి జరిగింది అన్న తర్వాత తన విచారణను చేపట్టిందని అన్నారు. ఇక సీఐడీ అరెస్ట్ చేసి కోర్టుకు అప్పగిస్తే ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిందని పేర్ని నాని గుర్తు చేశారు. బాబు కేసులు ఏసీబీ కోర్టులలో, హై కోర్టు సుప్రీం కోర్టులలో ఉన్నాయని, అక్కడ విచారణ సాగుతోందని పేర్ని నాని గుర్తు చేశారు.

కనీసం ఒక్క కంప్యూటర్ కూడా బిగించకుండా డబ్బులు ఇప్పించి హవాలా రూపంలో డబ్బులు తెచ్చి కిలారు రాజేష్ కి బాబు పీఏ శ్రీనివాస్ కి ఇచ్చినట్లుగా ఇన్ కం టాక్స్ తెలిపింది అని ఆయన గుర్తు చేశారు. వాస్తవాలు అన్నీ ఇలా ఉంటే చంద్రబాబు మీద వైసీపీ కక్ష అంటూ టీడీపీ నేతలు అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు.

అలా కేసులు అన్నీ కోర్టులలో ఉండి బాబుకు జైలు జీవితం కొనసాగుతూంటే మధ్యలో వైసీపీ మీద పడి ఏడవమేంటని టీడీపీ తమ్ముళ్లకు పేర్ని నాని తనదైన స్టైల్ లో తలంటారు. మా గొంతు నొక్కుతున్నారు అని విపక్షాలు అనడం మీద ఆయన సెటైర్లు వేశారు. మీరు నల్ల బ్యాడ్జీలు ధరించినా నల్ల రిబ్బన్లు కట్టుకున్నా అర్ధ నగ్న ప్రదర్శనలు చేసినా ఎవరైనా అడ్డుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. పవన్ టీడీపీతో పొత్తులు పెట్టుకుంటే ఎవరైనా అడ్డు పడ్డారా అని పేర్ని నాని కామెంట్స్ చేశారు.

లేని పోని వన్నీ మాట్లాడుతూ డ్రామాలు అడితే జనాలకు అన్నీ తెలుసు అని పేర్ని నాని స్పష్టం చేశారు. కాలం మారిన వేళ ఎవరెన్ని చెప్పినా నడిచేది ఉండదని తెలుసుకోవాలని ఆయన హితబోధ చేశారు. మొత్తానికి పేర్ని నాని టోటల్ ప్రెస్ మీట్ ఓ హైలెట్ ఏంటి అంటే రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని బాబు సొమ్ము లాయర్ల పాలు అని. ఈ సెటైర్లు అదిరిందా మరి.