నేను దళితుణ్ణి.. అందుకే నా ఫొటో పెట్టలేదు: పెద్దపల్లి ఎంపీ
రాష్ట్రంలో కుల వివక్ష కొనసాగుతోందని.. పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఆయన తెలంగాణ సీనియర్ నాయకుడు గడ్డం వివేకానంద కుమారుడన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 May 2025 10:00 AMరాష్ట్రంలో కుల వివక్ష కొనసాగుతోందని.. పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఆయన తెలంగాణ సీనియర్ నాయకుడు గడ్డం వివేకానంద కుమారుడన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి విజయందక్కించుకున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నదీ పుష్కరాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ పుష్కరాల వేళ.. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై వివాదం రాజుకుంది.
ప్రభుత్వం ఇక్కడ కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అయితే.. తన నియోజకవర్గం పరిధిలోనే పుష్కరా లు జరుగుతున్నా.. సదరు ఫ్లెక్సీలలో తన ఫొటో లేకపోవడాన్ని వంశీ కృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు. అయి తే.. ఆయన దీనిని కులం కోణంలో విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుం ది. పైగా.. పుష్కరాల వేళ తనకు ఆహ్వానం కూడా అందలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలపై వంశీ అనుచరులు సోమవారం పుష్కర ఘాట్ వద్ద ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ 'డబ్బు కంటే కులం చాలా గొప్పది. కులాన్ని బట్టి ఎవరెలా ప్రవర్తిస్తున్నారో తెలిసింది. రాష్ట్రం వివక్ష కొనసాగుతోందనడానికి ఇదే ఉదాహరణ'అని సంచలన కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఈ నెల 15నే పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లో ముగియనున్నాయి. అయితే.. నాడు పుష్కరాల ప్రారంభం వేళ.. స్థానిక ఎంపీగా తనకు ఆహ్వానం అందలేదని వంశీ కృష్ణ ఆరోపించారు.
ఇక, ఫ్లెక్సీల్లోనూ ఆయన ఫొటోలు లేకుండా పోయాయి. ఇది తీవ్ర వివాదంగా మారింది. ఆయన ఫోటోను పెట్టలేదని వంశీకృష్ణ అనుచరులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలు ఎన్నుకున్న దళిత ఎంపీని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీనిపైనే తాజాగా స్పందించిన వంశీ కృష్ణ తాను దళితుడిని కావడంతోనే.. ఇలా చేశారని.. వ్యాఖ్యానించడం గమనార్హం. మరి దీనిపై ప్రభుత్వం స్పంది స్తుందో లేదో చూడాలి. మరోవైపు.. సామాజిక తెలంగాణ నినాదం వినిపిస్తున్న సమయంలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి.