Begin typing your search above and press return to search.

ముద్రగడతో పవన్... డేట్ ఫిక్స్...!

గోదావరి జిల్లాలకు చెందిన కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 9:04 AM GMT
ముద్రగడతో పవన్... డేట్ ఫిక్స్...!
X

గోదావరి జిల్లాలకు చెందిన కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. సంక్రాంతి పండుగ అయిన తరువాత ఈ నెల 20 లేదా 23 తేదిలలో పవన్ ముద్రగడ తొలి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ భేటీ కోసం స్వయంగా పవన్ కళ్యాణ్ కాకినాడ వచ్చి కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలోనే ఆయనను కలుసుకుంటారు అని జనసేన వర్గాలు తెలిపాయి. ముద్రగడ జనసేనలో చేరికకు సుముఖంగా ఉన్నారు అని వార్తలు వచ్చాయి.

ఇక గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేత బొలిశెటి శ్రీనివాస్ ముద్రగడతో ఇప్పటికే కలసి చర్చించారు ఆ మీదట ఆ విషయం పవన్ కళ్యాణ్ తోనూ చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ ముద్రగడ కలసి మూడు రోజుల క్రితం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఇపుడు మిగిలింది ఏంటి అంటే పవన్ ముద్రగడ భేటీ కావడం. దానికి వేదిక ముద్రగడ నివాసం కిర్లంపూడి కాబోతోంది. పవన్ కాకినాడ వచ్చి ముద్రగడతో భేటీ తరువాత మంచి ముహూర్తం చూసుకుని ముద్రగడ జనసేన పార్టీ ఆఫీసులో తన అనుచరులతో కలసి ఆ పార్టీలో చేరుతారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ముద్రగడ కోసం పవన్ స్వయంగా ఆయన నివాసానికి వస్తున్నారు అని బొలిశెట్టి చెప్పారు. ఉద్యమ నాయకుడిని తానే స్వయంగా వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం గౌరవం అని పవన్ అన్నట్లుగా బొలిశెట్టి చెప్పారు.

మొత్తం మీద చూస్తే ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన 2024 ఎన్నికలతో రీ ఎంట్రీ ఇస్తారని వచ్చిన వార్తలు నిజం కాబోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ముద్రగడ కాకినాడ పార్లమెంట్ నుంచి కానీ లేదా పిఠాపురం అసెంబ్లీ నుంచి కానీ పోటీ చేయవచ్చు అని అంటున్నారు.

అదే విధంగా ఆయన కుమారుడు ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. ఇక ముద్రగడ సన్నిహితులకు కూడా కొన్ని టికెట్లు ఇప్పించుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ముద్రగడ జనసేనలో చేరడం అంటే గోదావరి జిల్లాలలో కీలకమైన పరిణామంగానే చూస్తున్నారు.

అంతే కాదు ముద్రగడ చివరిసారిగా పోటీ చేసింది 2009 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఆయన తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నారు. అది కూడా ప్రస్తుతం ఉన్న పార్టీల నుంచి కాకుండా జనసేన నుంచి. మొత్తం మీద ముద్రగడ రాజకీయం ఎలా సాగనుందో వేచి చూడాల్సిందే.