Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి పేస్ టు పేస్ అవ్వుతున్నారా ?

ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కి ఇది గోల్డెన్ ఛాన్స్. ఆయనలో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ అన్నది తెలిసిందే.

By:  Tupaki Desk   |   5 April 2025 6:39 AM
పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి పేస్ టు పేస్ అవ్వుతున్నారా ?
X

ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కి ఇది గోల్డెన్ ఛాన్స్. ఆయనలో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ అన్నది తెలిసిందే. ఆయన తానుగా సనాతన ధర్మాన్ని విశ్వసిస్తున్నట్లుగా ఇటీవల కాలంలో ప్రకటించుకున్నారు. అంతే కాదు ఆయన గుడులు గోపురాలు ప్రసిద్ధ దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. తిరుపతి లడ్డూ కల్తీ అయిందని వచ్చిన వార్తల తరువాత ఆయన ఏకంగా దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని డిమాండ్ సైతం చేశారు.

ఇలా పవన్ ఏడాదిలో అధిక కాలం వివిధ దీక్షలను చేపట్టి ఎపుడూ ఆయా దీక్షలకు అనుగుణంగా దీక్షా వస్త్రాలతో కనిపిస్తూ ఉంటారు. ఆయనకు ఇపుడు ఒక అరుదైన అవకాశం వచ్చింది. దక్షిణ అయోధ్య పేరు గడించిన భద్రాచలం శ్రీ రాముల వారి ఆలయంలో స్వామి వారి కళ్యాణాన్ని తిలకించడమే కాకుండా ఏపీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించే గోల్డెన్ చాన్స్ ని పవన్ కళ్యాణ్ అందుకున్నారు

ఏపీ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ శ్రీరాముల వారికి ముత్యాల తలంబ్రాలను కూడా అందచేస్తారు. దీని కోసం పవన్ శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరి భద్రాచలం చేరుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత తొలిసారి ఖమ్మం జిల్లా వస్తున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ కి స్థానిక జనసేన నాయకులు ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ నాయకుడికి అడుగడునా వారు గ్రాండ్ వెల్ కం చెప్పబోతున్నారు.

ఇక చూస్తే కనుక పవన్ ఈ రాత్రికి భద్రాచలంలో బస చేసి రేపు రోజంతా స్వామి వారి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. మరో వైపు చూస్తే తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వామి వారికి తెలంగాణా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందచేసేందుకు స్వయంగా వస్తున్నారు ఆయన కూడా స్వామి వారి కళ్యాణం కార్యక్రమంలో పాలు పంచుకుంటారు.

ఈ విధంగా చూస్తే రేవంత్ రెడ్డి పవన్ భద్రాచలంలో కలుసుకుంటారు అని అంటున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత రేవంత్ రెడ్డికి కలుసుకోవడం కూడా ఇదే తొలిసారి అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ దేవాదాయ శాఖ మంత్రి కాదు, కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏపీ ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు తీసుకుని వెళ్తున్నారు.

ఆ విధంగా పవన్ ఆలోచనలను ఆయన ఆధ్యాత్మికతను గౌరవిస్తూ ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడు అంటున్నారు. ఆయన రాజకీయంగా ఉన్నత స్థానం లభించింది. ఇపుడు ఆయన కోరుకున్న తీరున ముందుకు సాగే అవకాశాలు అందుతున్నాయని అంటున్నారు.