పాక్ నాలుగు ముక్కలు.... సంచలన జోస్యం
పాకిస్థాన్ పేరు వింటే భారత్ పౌరులు భగ్గుమంటున్నారు. దానికి కారణం కాశ్మీర్ లో తాజాగా జరిగిన ఉగ్రదాడి.
By: Tupaki Desk | 28 April 2025 4:16 AMపాకిస్థాన్ పేరు వింటే భారత్ పౌరులు భగ్గుమంటున్నారు. దానికి కారణం కాశ్మీర్ లో తాజాగా జరిగిన ఉగ్రదాడి. ఈ దాడిలో అమాయకులైన 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో భార పౌరులు అంతా దాయాది వైపే వెలెత్తి చూపిస్తున్నారు. ఆ దేశం భారత్ మీద పడి చేస్తున్న దాష్టికాన్ని తప్పు పడుతున్నారు. పాక్ పని పట్టాలని కోరుతున్నారు.
జనాల ఆవేశం ఇలా ఉంటే బీజేపీ నేతల వీరావేశం వేరే లెవెల్ లో ఉంది. బీజేపీకి చెందిన ఎంపీ నిషికాంత్ దూబే అయితే పాక్ మీద సంచలన ఆరోపణలు చేశారు. పాక్ ఈ ఏడాది చివరి నాటికి నాలుగు ముక్కలవుతుందని తనదైన రాజకీయ జోస్యం చెప్పారు. పాక్ ఈ సంవత్సరంలోగా ముక్క చెక్కలైపోవడం ఖాయమన్నారు.
అయితే ఈ నాలుగు ముక్కలు ఎలా అవుతుందో కూడా దూబే వివరించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటుంది అని అంటున్నారు. ఆ మీదట పాకిస్థాన్, బెలూచిస్తాన్, ఫఖ్తునిస్తాన్, పంజాబ్ అని నాలుగు భాగాలుగా పాక్ విభజింపబడుతుంది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను పూర్తి విశ్వాసంతోనే ఈ మాటలు చెబుతున్నాను అని ఆయన అంటున్నారు. నా మాట నిజం అవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి పాక్ నాలుగు ముక్కలు కాకపోతే బీజేపీ తప్పుగా చెబుతోంది అని మీరే ఆరోపించవచ్చు అని నిషికాంత్ దూబే గట్టి ధీమాతో చెబుతున్నారు.
ప్రపంచ పటం మీద పాకిష్తాన్ అంతం అవుతుందని ఆయన చెప్పారు ఇదే నరేంద్ర మోడీ హామీ కూడా అంటున్నారు కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఎంతకైనా ప్రతీకారం తీర్చుకుంటుంది అని ఆయన అన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని దూబే స్పష్టం చేస్తున్నారు. ఇది మోడీ సామర్ధ్యమని అన్నారు.
మోడీ సత్తా ఏమిటో ఈ పాటికే ప్రపంచం చూసిందని ఆయన చెబుతూ పాక్ కూడా అది రుచి చూడబోతోంది అని అంటున్నారు పాకిస్థాన్ నాలుగు ముక్కలు కావడం అంటే నిజంగానే అది ఒక సంచలనమే అవుతుంది పాక్ కో అంతర్యుద్ధం ఉంది. అక్కడ రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రజలలో అశాంతి ఉంది. వీటిని బేస్ చేసుకుని భారత్ వ్యూహాత్మకంగా పావులు కదిపితే కనుక కచ్చితంగా పాక్ ఇబ్బందులో పడుతుంది. మరి అది మూడు ముక్కలవుతుందా నాలుగు అవుతుందా అంటే వెయిట్ అండ్ సీ.