ఏమిటీ అల్ట్రా స్టేట్ కమ్యూనికేషన్? పహల్గామ్లో టెర్రరిస్టులకు ఎలా ఉపయోగపడింది?
టెర్రరిస్టులు కూడా ఇప్పుడు హైటెక్నాలజీని ఉపయోగిస్తున్నారని ఈ ఘటనతో స్పష్టమవుతోంది.
By: Tupaki Desk | 2 May 2025 12:00 PMపహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు అమాయక ప్రజలపై కాల్పులు జరిపిన ఘటన ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ నిర్వహిస్తోంది. విచారణలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా NIA వర్గాల సమాచారం ప్రకారం.. టెర్రరిస్టులు "అల్ట్రా స్టేట్ కమ్యూనికేషన్ సిస్టమ్" అనే ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలిసింది. అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? టెర్రరిస్టులకు ఇది ఎలా ఉపయోగపడింది? ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అసలు ఏమిటీ అల్ట్రా స్టేట్ కమ్యూనికేషన్ సిస్టమ్?
టెర్రరిస్టులు కూడా ఇప్పుడు హైటెక్నాలజీని ఉపయోగిస్తున్నారని ఈ ఘటనతో స్పష్టమవుతోంది. ఎవరూ ఊహించని విధంగా వాళ్లు ఒక అడుగు ముందున్నారు. సిమ్ కార్డు లేకుండా కూడా ఎవరితోనైనా మాట్లాడగలరా? సాధారణంగా అయితే కుదరదు. కానీ పహల్గామ్ టెర్రరిస్టులు ఒక ప్రత్యేకమైన సిస్టమ్ను ఉపయోగించారు. దీనికి సిమ్ కార్డు అవసరం లేదు. సిమ్ లేకుండానే ఈ సిస్టమ్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు.. మెసేజ్లు పంపుకోవచ్చు.
పహల్గామ్ దాడిలో టెర్రరిస్టులు అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగించారు. టెర్రరిస్టులు వాడిన ఈ సిస్టమ్ సిమ్ కార్డు లేకుండానే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి, సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఉపయోగపడింది. పంచుకోవడానికి ఉపయోగపడింది.
ఈ సిస్టమ్ రేంజ్ ఎంత?
సురక్షితమైన కమ్యూనికేషన్ను అందించే ఈ సిస్టమ్ కేవలం తక్కువ రేంజ్ లో మాత్రమే పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ రేంజ్ ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుందనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కాకపోతే విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఈ సిస్టమ్ రెండు సిగ్నల్స్ను గుర్తించారు. ఈ కొత్త సమాచారం తెలిసిన తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ తన విచారణను మరింత వేగవంతం చేసింది. టెర్రరిస్టులు అల్ట్రా స్టేట్ కమ్యూనికేషన్ సిస్టమ్తో పాటు హెల్మెట్పై బాడీ కెమెరాలు, ఎన్క్రిప్టెడ్ యాప్లను కూడా ఉపయోగించారు.