Begin typing your search above and press return to search.

భారత ఆర్మీపై పాక్ క్రికెట్ లెజెండ్ షహీద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు!

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకేదో కాలి ఇంకొకడు ఏడుస్తున్నాడట.. పాకిస్తాన్ ప్రముఖుల పరిస్థితి అలా ఉంది.

By:  Tupaki Desk   |   28 April 2025 4:21 AM
భారత ఆర్మీపై పాక్ క్రికెట్ లెజెండ్ షహీద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు!
X

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకేదో కాలి ఇంకొకడు ఏడుస్తున్నాడట.. పాకిస్తాన్ ప్రముఖుల పరిస్థితి అలా ఉంది.

ఈనెల 24న జమ్మూ కాశ్మీర్‌లోని పహెల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అత్యంత దారుణమైన, అమానవీయ చర్యలలో ఒకటి. ఈ దురదృష్టకర ఘటనలో 27 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, ఈ షాకింగ్ ఘటనపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ లెజెండ్ షహీద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఎదుర్కోవడంలో భారత ఆర్మీ సామర్థ్యాన్ని షహీద్ అఫ్రిది తీవ్రంగా విమర్శించారు. కాశ్మీర్‌లో 8 లక్షల మంది భారత సైనికులు మోహరించి ఉన్నప్పటికీ, వారు దాడిని నివారించడంలో లేదా దాడి జరిగినప్పుడు సకాలంలో స్పందించడంలో విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. పౌరులను రక్షించడంలో వారి అసమర్థత వారి దక్షతను ప్రశ్నార్థకం చేసిందని ఆయన భారత బలగాల సామర్థ్యాన్ని ప్రశ్నించారు.

అంతేకాకుండా, దాడికి సరైన ఆధారాలు లేకుండానే పాకిస్థాన్‌ను భారత్ తొందరపడి నిందిస్తోందని, తమ దేశాన్ని బలిపశువుగా వాడుకుంటోందని షహీద్ అఫ్రిది ఆరోపించారు.

దాడిని ఖండించడమే కాకుండా, ఈ ఘటనలో పాకిస్థాన్ ప్రమేయంపై పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తిన షహీద్ అఫ్రిది వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ఇలాంటి ఘటనలపై పాకిస్థాన్ నుండి ఆశించే సామాజిక అవగాహన స్థాయికి ఇది అద్దం పడుతోందని కొందరు సామాజిక పరిశీలకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

మొత్తానికి, పహెల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో షహీద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్ర నిరసనను, చర్చను రేకెత్తించాయి.

-దాడి జరిగిందిలా..

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో లిడ్డర్ నది ఒడ్డున, హిమాలయాలలో సుమారు 7,200 అడుగుల ఎత్తులో ఉన్న పెహల్గాంకు దేశం నలుమూలల నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సహజ సౌందర్యం, సతత హరిత అడవులు, మంచు కొండలు, పచ్చని లోయలతో అలరారే ఈ ప్రాంతంలో శాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు జరిపారు.

ఈ దాడిలో 27 ది పర్యాటకులు మరిణించారు. చాలా మంది గాయపడ్డారు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి.

ఇటీవల కాలంలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా పెహల్గాం వంటి ప్రాంతాలకు వేలాది మంది టూరిస్టులు వస్తున్నారు. పర్యాటకం పుంజుకోవడాన్ని జీర్ణించుకోలేని ఉగ్రవాదులు భయానక వాతావరణాన్ని సృష్టించేందుకే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. పెహల్గాం ప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్రకు ప్రారంభ స్థానంగా కూడా ఉంది.

ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రముఖులు భారత చర్యలపై అక్కసుతో నోరు పారేసుకుంటూ అక్కసవెళ్లగక్కుతున్నారు.