పాక్ తో యుద్ధం.. రంగంలోకి లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోనీ?
పారా మిలటరీకి సెలవులు రద్దు చేసింది. పాక్ జాతీయులను తక్షణమే వెళ్లిపోవాలి అని ఆదేశాలు ఇచ్చింది.
By: Tupaki Desk | 26 April 2025 7:30 PMపెహల్గాం ఘటన జరిగి నాలుగు రోజులు దాటిపోయింది. 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయి దేశం అంతా అట్టుడుకుతోంది.. ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోమంటూ భారతావని ముక్త కంఠంతో కోరుతోంది..
అటు కేంద్ర ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. పారా మిలటరీకి సెలవులు రద్దు చేసింది. పాక్ జాతీయులను తక్షణమే వెళ్లిపోవాలి అని ఆదేశాలు ఇచ్చింది.
ఇక మిగిలింది నేరుగా యుద్ధమే.. సైన్యం కూడా తాము సిద్ధమే అని తేల్చిచెప్పింది.. నేవీ కూడా దీనికిముందే సై అని అన్నది.. మరి యుద్ధమే వస్తే..?
మోదీకి చెప్పుకొన్నా..
ఇక్కడిదాకా వచ్చాక భారత్ ఏమీ చేయకుండా ఉంటే అతి మోదీ ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది. పైగ పెహల్గాంలో ఉగ్రవాదులు మోదీకి చెప్పుకో అంటూ భారతీయులను కాల్చి చంపారు. అలాంటప్పుడు మన ప్రతిస్పందన కూడా అంతే దీటుగా ఉండాలి. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కలిపేసుకోవడమా? పాకిస్థాన్ లోని ఉగ్ర వాద స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడమా? అనేది చూడాలి.
పూర్తి స్థాయి యుద్ధం వస్తే..?
పాకిస్థాన్ ను ఇప్పటివరకు మూడుసార్లు యుద్ధంలో మట్టికరిపించింది భారత్. చివరగా 1999లో కార్గిల్ యుద్ధం సంభవించింది. ఇప్పుడు జరిగితే నాలుగో యుద్ధం అవుతుంది.
మరి ధోనీ ఎంటర్ అవుతుడా?
2004 భారత క్రికెట్ జట్టుకు ఎంపికై.. ఆపై పదేళ్లు కెప్టెన్ గానూ వ్యవహరించాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. పైగా ధోనీకి దేశ భక్తి ఎక్కువ. క్రికెట్ లో కొనసాగుతున్నప్పుడే సైన్యంలో చేరాడు. పారాచూట్ రెజిమెంట్ లో 2011లో అతడికి లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ) హోదా ఇచ్చారు. భారత సైన్యలో ఇది ఆరో ర్యాంక్. ఇదే ఏడాది భారత్ వన్డే ప్రపంచ చాంపియన్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ధోనీ కొద్ది రోజులు సైన్యంలో కూడా పనిచేశాడు.
ధోనీ భారత్ కు ఆడకముందు 1999లో పాకిస్థాన్ తో యుద్ధం జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆ వాతావరణం కనిపిస్తోంది. ఒకవేళ యుద్ధమే జరిగితే ధోనీ పాల్గొంటాడా? అనేది ఆసక్తికరం. ఏమో..? దీనికి కాదని చెప్పలేం.