మొదలుపెట్టిన ఆర్మీ.. ఉరిలో ఎన్ కౌంటర్.. రిజల్ట్ ఇదే!
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయిన సంగతి తెలిసిందే. అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులను ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు.
By: Tupaki Desk | 23 April 2025 5:50 AMజమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయిన సంగతి తెలిసిందే. అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులను ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ సమయంలో భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకొని ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. ఈ సమయంలో తాజాగా ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి!
అవును... జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భద్రతాదళాలు వేటను ముమ్మరం చేశాయి. ఈ సమయంలో తాజాగా బుధవారం భారత్ లో ప్రవేశించేందుకు ఉరి నాలా వద్ద మరో 2-3 ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ సమయంలో వారిని సైన్యం గుర్తించింది. ఈ సమయంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు చినార్ కోర్ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.
చినార్ కాప్స్ ఇండియన్ ఆర్మీ ఎక్స్ హ్యాండిల్ లో తాజాగా చేసిన ఓ పోస్ట్ లో ఈ ఆపరేషన్ ను ధృవీకరించింది. ఆ పోస్ట్ లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయని.. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని.. ఉగ్రవాదుల నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
మరోపక్క అనంతనాగ్ లోని మెడికల్ కాలేజీ భద్రతను పూర్తిగా కట్టుదిట్టం చేశారు. తాజాగా పహల్గాం మృతులకు అమిత్ షా నివాళులు అర్పించారు. అప్పటికే ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాలు చేరుకొన్నాయి. ఇదే సమయంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన అధికారులు చేరుకున్నారు.