Begin typing your search above and press return to search.

దాయాదీకి దడదడ... పాక్ రాజధానిలో సైరన్లు స్టార్ట్!

అయితే.. ఆ దాడికి ప్రతీకారంగా పాక్ దాడులు మొదలుపెట్టింది. దీంతో... పాక్ ను భారత్ వితౌట్ గ్యాప్ వణికించేస్తుంది.

By:  Tupaki Desk   |   8 May 2025 10:24 PM IST
US Issues Emergency Alert in Lahore as India-Pakistan Tensions Surge
X

ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ లో టెన్షన్ మొదలైందని అంటున్నారు. భారత పౌరులపై ఉగ్రవాదులు దాడులు చేస్తే.. అందుకు ప్రతీకారంగా పాక్ సైనిక స్థావరాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసింది. అయితే.. ఆ దాడికి ప్రతీకారంగా పాక్ దాడులు మొదలుపెట్టింది. దీంతో... పాక్ ను భారత్ వితౌట్ గ్యాప్ వణికించేస్తుంది.

భారత్ లోని 15 నగరాలపై దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించగా.. ఆ ప్రయత్నాన్ని బలంగా తిప్పికొట్టింది. అనంతరం కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. లాహోర్ తో పాటు 7 ప్రాంతాల్లో పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది! అంతకంటే ముందు లాహోర్ ఎయిర్ పోర్ట్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ, ప్రజానికంతో పాటు ప్రభుత్వం కూడా ఉక్కిరిబిక్కిరి అవుతుందని అంటున్నారు! ఈ సమయంలో పాకిస్థాన్ సర్కార్ సమీక్ష సమావేశం నిర్వహించింది! ఈ సందర్భంగా పాక్ పార్లమెంట్ లోని నేతలు భారత దాడుల నేపథ్యంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. దీంతో... పాక్ రాజధాని ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేస్తున్న వేళ.. ఏ క్షణం ఏ డ్రోన్, ఏ క్షిపణి వచ్చి పడుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుందని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్న తన ప్రజలకు అమెరికా అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా.. తక్షణం లాహోర్ ను విడిచి వెళ్లాలని సూచించింది. అయితే... తాజాగా గురువారం నెలకొన్న డ్రోన్ దాడుల నేపథ్యంలో అగ్రరాజ్యం తన ప్రజలకు ఈ సూచన చేసినట్లు చెబుతున్నారు.