Begin typing your search above and press return to search.

వైరల్ వీడియోలు... నెట్టింట మీమ్స్, బలుచిస్తాన్ లో డ్యాన్స్!

బుధవారం నాడు భారతదేశంలోని 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలని ప్రకటించింది కేంద్రం.

By:  Tupaki Desk   |   7 May 2025 7:20 AM
Operation Sindoor India Midnight Strike Stuns Pakistan
X

బుధవారం నాడు భారతదేశంలోని 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలని ప్రకటించింది కేంద్రం. దీంతో యావత్ భారతీయులు, మీడియా, పక్క దేశం సైతం బుధవారం భారత్ లో జరగబోయేది అది మాత్రమే అని భావించారు. అయితే... మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత జరిగింది వేరు. మాక్ డ్రిల్ అని భారత్.. పాక్ కు ఊహించని షాక్ ఇచ్చింది!

అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తమపై ఏక్షణమైనా యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని పాకిస్థాన్ చెప్పుకుంటుంట్ది. అయితే ఆ కామెంట్లకు భారత్ సమాధానం చెప్పలేదు. కాకపోతే యుద్ధ సన్నద్ధాల్లో భాగంగా అన్నట్లుగా మాక్ డ్రిల్స్ అని ప్రకటించింది. పాక్ కూడా రష్యా విక్టరీ డే తర్వాత మే 10, 11ల్లో తమపై దాడి చేయొచ్చని భావించింది.

ఈ గ్యాప్ లో మంగళవారం అర్ధరాత్రి ఊహించని రీతిలో ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ సందర్భంగా 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారు. కాకపోతే పాక్ మాత్రం అందులో మూడో వంతు మరణాలు చెప్పుకుని ఆత్మవంచన చేసుకుంటుందని కథనాలొస్తున్నాయి.

ఈ సమయంలో... మాక్ డ్రిల్ పేరు చెప్పి పాకిస్థాన్ ను భారత్ ఏ విధంగా కోట్టిందో చెప్పేలా ఉన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... మాక్ డ్రిల్ అని మొదలుపెట్టిన భారత్ కర్ర పాక్ కు ఎలా తగిలింది, తర్వాత పాక్ పరిస్థితి ఏమిటనేది స్పష్టంగా చూపించే మీమ్ వీడియోగా అది వైరల్ అవుతుంది.

బలుచిస్తాన్ లో డ్యాన్సులే డ్యాన్సులు!:

ఆపరేషన్ సిందూర్ అనంతరం... పాకిస్థాన్ నుంచి స్వతంత్రం కోరుకుంటున్న బలుచిస్తాన్ లో జనాలు డ్యాన్సులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. పాక్ కు అత్యంత బలంగా ఉన్న ఉగ్రవాదులకు చెందిన 9 శిబిరాలు ధ్వంసమై, సుమారు 80 మంది మరణించడాన్ని బలుచిస్తాన్ ప్రజలు తమకు అత్యంత గుడ్ న్యూస్ గా భావిస్తున్నారు.

ఈ సమయంలో... ఆపరేషన్ సిందూర్ అనంతరం బలుచిస్తాన్ లో ప్రజలు సంబరాలు స్టార్ట్ చేశారు. వీరి డ్యాన్సులకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

కాగా... కొంతకాలంగా పాకిస్థాన్ ఆర్మీ లక్ష్యంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వీరి దాడుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ సుమారు 200 మంది పాక్ సైనికులు మరణించారు. మరోపక్క ఖైబర్ ఫాఖ్తూన్ ఖా, సింధ్ ఫ్రావిన్స్ లలో కూడా పాక్ ఆర్మీకి ఎదురుగాలులు వీస్తున్నాయి.