Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సింధూర్ తర్వాత గూగుల్ మ్యాప్స్ లో వచ్చిన మార్పులు

'ఆపరేషన్ సింధూర్' తర్వాత గూగుల్ మ్యాప్స్‌లో భౌగోళికంగా లేదా మ్యాపింగ్ డేటాలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 May 2025 4:54 AM
ఆపరేషన్ సింధూర్ తర్వాత గూగుల్ మ్యాప్స్ లో వచ్చిన మార్పులు
X

పాకిస్తాన్ - పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలపై భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' తో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా భారత్ కు మద్దతు.. పాక్ ఉగ్రవాదంపై వ్యతిరేకత పెరుగుతోంది. . భారతదేశంలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ దాడులలో ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా చేసుకున్నట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఈ సైనిక చర్య తర్వాత గూగుల్ మ్యాప్స్‌లో పాకిస్తాన్ సంబంధిత ప్రాంతాలలో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నాయా అనే దానిపై పలువురు ఆసక్తి చూపుతున్నారు.


అందుబాటులో ఉన్న సమాచారం.. వార్తా నివేదికల ప్రకారం, 'ఆపరేషన్ సింధూర్' తర్వాత గూగుల్ మ్యాప్స్‌లో భౌగోళికంగా లేదా మ్యాపింగ్ డేటాలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. కశ్మీర్ ను ప్రధానంగా మూడు ముక్కలుగా గూగుల్ మ్యాప్ చూపించేది. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ ఒకటి కాగా.. భారత అడ్మినిస్ట్రేషన్ జమ్మూకశ్మీర్, చైనా ఆక్రమించిన సియాచీన్ ప్రాంతాలు వేర్వేరుగా చూపించేవి. అయితే తాజాగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడితో అంతర్జాతీయ సంస్థ గూగుల్ కూడా మారింది. పీఓకే సహా చైనాలోని ప్రాంతాలు, ఆజాద్ కశ్మీర్ ను కూడా భారత్ లో అంతర్భాగంగా చూపించింది. దీన్ని బట్టి అమెరికా సహా పాశ్చాత్య దేశాలు కశ్మీర్ ను భారత్ ను అంతర్భాగంగా చూపిస్తున్నట్టు అర్థమవుతోంది.


ఆపరేషన్ జరిగిన తర్వాత పాకిస్తాన్‌లో, ముఖ్యంగా బహవల్పూర్ వంటి లక్ష్య ప్రాంతాలలో, ప్రజలు గూగుల్ మ్యాప్స్‌లో ఆయా ప్రదేశాలను ఎక్కువగా శోధించడం ప్రారంభించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఇది మ్యాప్స్‌లో మార్పులు జరగడాన్ని గమనించారు. పీఓకే, అజాద్ కశ్మీర్, సియాచిన్ లు భారత్ లో అంతర్భాగంగా గూగుల్ మార్చడం గమనార్హం. కేవలం ఆ ప్రాంతాలపై ప్రజల ఆసక్తి పెరగడాన్ని తెలియజేస్తుంది.

సాధారణంగా, గూగుల్ మ్యాప్స్ వంటి సేవలు ఎప్పటికప్పుడు ఉపగ్రహ చిత్రాలు.. ఇతర భౌగోళిక డేటాను ఉపయోగించి తమ మ్యాప్‌లను నవీకరిస్తాయి. అయితే, నిర్దిష్ట సైనిక కార్యకలాపాల కారణంగా భౌగోళిక స్వరూపంలో పెద్ద ఎత్తున మార్పులు సంభవించినప్పుడు తక్షణమే మ్యాప్‌లలో ప్రతిబింబించేలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆ దేశాల సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి అంతర్జాతీయ సంస్థలు ఇలా చేస్తాయి.. ప్రస్తుతానికి, 'ఆపరేషన్ సింధూర్' ప్రభావం గూగుల్ మ్యాప్స్‌లో దృశ్యమానమయ్యే స్థాయిలో ఉందని స్పష్టమవుతోంది.

కాబట్టి, 'ఆపరేషన్ సింధూర్' తర్వాత గూగుల్ మ్యాప్స్‌లో పాకిస్తాన్‌కు సంబంధించిన మ్యాపింగ్ డేటాలో చెప్పుకోదగిన మార్పులు జరిగాయి. మున్ముందు యుద్ధం, పీఓకే స్వాధీనానికి భారత్ యుద్ధం ప్రకటించినా అంతర్జాతీయంగా భారత్ కు మద్దలు లభిస్తుందని దీని ద్వారా తెలుస్తోంది. .