‘అలా నటించే అవకాశం పాక్ కు లేదు’.. ఇచ్చిపడేసిన నిక్కీ హేలీ!
పహల్గాంలో అత్యంత పాశవిక ఉగ్రదాడిని ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాలు ఖండించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 5:07 PMపహల్గాంలో అత్యంత పాశవిక ఉగ్రదాడిని ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాలు ఖండించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఏమాత్రం సహకరించమని అమెరికా అంటే.. ఉగ్రవాదాన్ని అణిచివేసే విషయంలో భారత్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇజ్రాయెల్, యూకే స్పష్టంగా ప్రకటించాయి!
ఈ నేపథ్యలో ఆ ఉగ్రదాడి జరిగిన సుమారు రెండు వారాల తర్వాత భారత్ ప్రతీకార చర్యకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా... పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది.. ఈ క్రమంలో 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సమయంలో.. తాము కూడా ఉగ్రవాద బాధితులమే అంటూ పాక్ కొత్త డ్రామాకు తెరలేపింది.
తాము ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వమని చెప్పుకొచ్చింది. కట్ చేస్తే... భారత్ ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన ఉగ్రవాదుల శవపేటికలపై తమ జాతీయ జెండాలు ఉంచి పాక్ అధికరికంగా అంత్యక్రియలు జరిపించింది. ఈ కార్యక్రమాలకు అటు ఉగ్రవాదులు, ఉగ్రవాద నాయకులతో పాటు ఆర్మీ అధికారులు హాజరయ్యారు. ఈ పరిణామల నేపథ్యంలో నిక్కీ హేలీ స్పందించారు!
అవును... ఉగ్రవాదం విషయంలో పాక్ ద్వంద్వ వైఖరి ప్రపంచానికి తెలియంది కాదు. అయినప్పటికీ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా అంతర్జాతీయ సమాజంలో నిస్సిగ్గుగా చలామని అయిపోతుంది! ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల విషయంలో పాక్ వైఖరిని ఖండిస్తూ, ఆ దేశాన్ని ఇకపై నాటకాలు ఆపాలని సూచించారు నిక్కీ హేలీ!
ఈ సందర్భంగా... "ఉగ్రవాదులు డజన్ల కొద్దీ భారతీయ పౌరులను చంపిన దాడిని ప్రారంభించారు.. భారతదేశానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి ప్రతీ హక్కు ఉంది. ఈ సమయంలో బాధితురాలిగా నటించే అవకాశం పాక్ కు లేదు.. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు ఏ దేశానికీ అనుమతి లేదు" అని ఆమె ‘ఎక్స్’ లో పోస్ట్ పెట్టారు.
ఈ విధంగా పహల్గాంలో ఉగ్రదాడి చేసి 26 మంది పౌరులను బలిగొన్న నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ భారతదేశ ప్రతీకార తీచ్రుకునే హక్కుకు బలమైన మద్దతును వ్యక్తం చేశారు.