Begin typing your search above and press return to search.

తమ్ముళ్లకు గుడ్ న్యూస్.. ఇక జైల్లో "చల్ల" గా చంద్రబాబు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబుకు... రాజమండ్రి సెంట్రల్ జైల్లో సదుపాయలు

By:  Tupaki Desk   |   15 Oct 2023 4:44 AM GMT
తమ్ముళ్లకు గుడ్ న్యూస్.. ఇక జైల్లో చల్ల గా చంద్రబాబు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబుకు... రాజమండ్రి సెంట్రల్ జైల్లో సదుపాయలు లేమని, ఆయన చర్మ సమస్యల దృష్ట్యా వేడిని భరించలేకపోతున్నారని టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చంద్రబాబు చేతులు, వీపు, మెడ, చేతులు మొదలైన ప్రాంతాల్లో స్మిన్ అలర్జీ వచ్చేసిందని, వేడి తగలకుండా ఉండాలని సూచించారు! ఈ సమయలో ఏసీబీ కోర్ట్ చంద్రబాబుకు చల్లని వార్త చెప్పింది.

అవును... స్కిల్ డేవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయనకు చల్లదనం కల్పించేలా టవర్‌ ఏసీ ఏర్పాటుచేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. ఇదే సమయంలో వెంటనే చర్యలు చేపట్టాలని రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌ కు స్పష్టం చేసింది.

అయితే ఈ విషయంపై మీడియా ముందూ, సోషల్ మీడియా యందూ ఫిర్యాదులు ఆరోపణలు గుప్పిస్తున్నరే తప్ప... చేయాల్సిన పనులు చేయలేదనే విమర్శలు బాబు కుటుంబ సభ్యులపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్సా సత్యన్నారాయణ హింట్ కూడా ఇచ్చారు. ఇందులో భాగంగా... న్యాయస్థానికి వెళ్తే రిలీఫ్ దొరికే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో... చంద్రబాబు తరఫు న్యాయవాదులు శనివారం సాయంత్రం ఏసీబీ కోర్టులో అత్యవసరంగా పిటిషన్‌ వేశారు.

ఇందులో భాగంగా... స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు వేడి వాతావరణం వల్ల రెండు వారాలుగా డీహైడ్రేషన్‌ తో బాధపడుతున్నారని, స్కిన్ ప్రాబ్లంస్ తో ఇబ్బందిపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని, ఆయన్ను చల్లని వాతావరణంలో ఉంచకపోతే ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. అందువల్ల అవసరమైన సదుపాయాల్ని కల్పించాలని కోరారు.

ఈ సమయంలో సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద స్పందిస్తూ.. నిర్ణయాన్ని కోర్టు విచక్షణాధికారానికి వదిలేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలూ తెలపలేదు. దీతో... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, చంద్రబాబు ఉన్న బ్యారెక్‌ లో టవర్‌ ఏసీ ఏర్పాటుచేయాలని న్యాయాధికారి హిమబిందు ఆన్‌ లైన్‌ లో విచారించి ఆదేశాలు జారీచేశారు.

ఈ ఆదేశాలతో హుట్టహుటున రియాక్ట్ అయ్యారు రాజమండ్రి జైలు అధికారులు. ఇందులో భాగంగా శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ టవర్‌ ఏసీని రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలకు తీసుకెళ్లినట్లు తెలిసింది! దీంతో ఇది బాబు కోసమే అని తమ్ముళ్లు కూల్ అయ్యారని అంటున్నారు.