Begin typing your search above and press return to search.

చంద్రబాబు హిమాచ‌ల్ టూర్‌.. కారణం ఇదేనా?

నిన్న మొన్నటి వ‌ర‌కు ఏపీలో కనిపించిన ఆయ‌న అక‌స్మాత్తుగా హిమాచ‌ల్ ప్రదేశ్‌ లో క‌నిపించ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

By:  Tupaki Desk   |   15 Aug 2023 5:01 AM GMT
చంద్రబాబు హిమాచ‌ల్ టూర్‌.. కారణం ఇదేనా?
X

టీడీపీ అధినేత చంద్రబాబు.. అనూహ్యంగా హిమాచ‌ల్ ప్రదేశ్‌ లో ప్రత్యక్షమ‌య్యారు. నిన్న మొన్నటి వ‌ర‌కు ఏపీలో కనిపించిన ఆయ‌న అక‌స్మాత్తుగా హిమాచ‌ల్ ప్రదేశ్‌ లో క‌నిపించ‌డం.. రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఆ రాష్ట్ర గవర్నర్ తెలంగాణలోని బీజేపీ పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం.

అవును... చంద్రబాబు నాయుడు ఆయన సతీమణితో కలిపి హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. వాస్తవానికి ఆదివారం కూడా చంద్రబాబు ఏపీలోనే ఉన్నారు. టీడీపీ కార్యక‌ర్తల‌పైనా.. నాయ‌కుల‌పైనా.. తనపైనా దాడులు జరుగుతున్నాయంటూ ప్ర‌ధాని, రాష్ట్రప‌తుల‌కు ఆయ‌న లేఖ సంధించారు.

అయితే వ్యాహ్యాళి కోసం.. వెళ్లార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌.. స‌తీస‌మేతంగా చంద్రబాబు హిమాచ‌ల్ ప్రదేశ్ కు వెళ్లార‌ని అంటున్నాయి. ఇదే సమయంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను హర్యానా రాజ్‌ భవన్‌ లో మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబాబు దంపతులు.

ఈ సందర్భంగా... బాబు దంపతులకు గవర్నర్, ఆయన సతీమణి బండారు వసంత రాజ్‌ భవన్‌ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు, భువేశ్వరికి శాలువా కప్పి, కృష్ణుడి విగ్రహాన్ని గవర్నర్ దంపతులు అందజేశారు. సుమారు అరగంటకు పైగా బాబు-దత్తన్న చర్చించుకున్నారు.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపైనా ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌లపైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ ఈసారి కాస్త కీలకంగా మారడం.. ఇదే సమయంలో ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాలే గ‌డువు ఉండ‌డంతో బాబు - ద‌త్తాత్రేయ‌ల భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

మరోపక్క ఏపీలో జనసేన - బీజేపీ పొత్తుతో చంద్రబాబు కలవాలనుకుంటున్నారంటూ కథనాలొస్తున్న తరుణంలో... ప్రభుత్వ ఓటు బ్యాంకు చీలనివ్వకూడదనే స్టేట్ మెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో... ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడిందని అంటున్నారు పరిశీలకులు!