Begin typing your search above and press return to search.

ఇంకా మాకు అనుచ‌రులు ఎక్క‌డున్నారు: వైసీపీ నేత నందిగం

ఈ కేసును మ‌రింత‌లోతుగా విచారించేందుకు.. నందిగంను రెండో రోజుల పాటు ప‌ల్నాడు జిల్లా పోలీసు లు త‌మ క‌స్ట‌డీకి తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   31 May 2025 11:56 AM
ఇంకా మాకు అనుచ‌రులు ఎక్క‌డున్నారు:  వైసీపీ నేత నందిగం
X

''పార్టీ ఓడిపోయింది. దాంతో పాటు మా అనుచ‌రులు కూడా మ‌మ్మ‌ల్ని వ‌దిలేశారు. ఇంక మాకు అనుచ‌రు లు ఎక్కుడున్నారు.'' అని.. వైసీపీ నాయ‌కుడు, బాప‌ట్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసుల‌తో వ్యాఖ్యానించారు. తాజాగా ఆయ‌న‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌పై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో స్థానిక కోర్టు ఆయ‌నను జైలుకు త‌ర‌లించింది. దీంతో పోలీసులు గ‌తంలో ఏ జైల్లో ఉంచారో.. అదే జైల్లో అదే గ‌దిలో పెట్టారు.

ఈ కేసును మ‌రింత‌లోతుగా విచారించేందుకు.. నందిగంను రెండో రోజుల పాటు ప‌ల్నాడు జిల్లా పోలీసు లు త‌మ క‌స్ట‌డీకి తీసుకున్నారు. ఈ విచార‌ణ కూడా.. రెండో రోజు శ‌నివారం ముగిసింది. ఈ విచార‌ణ‌లో పోలీసులు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. టీడీపీ కార్య‌క‌ర్త‌పై దాడి చేసింది ఎవ‌రు? మీ అనుచ‌రులా? అని ప్ర‌శ్నించిన‌ప్పుడు.. త‌మ‌కు అనుచ‌రులు లేర‌ని.. పార్టీ ఓడిపోయిన‌ప్పుడే వారు త‌మ‌ను విడిచి పెట్టార‌ని.. ఇప్పుడు వ‌స్తార‌న్న న‌మ్మ‌కం కూడా త‌న‌కులేద‌న్నారు.

అంతేకాదు.. పార్టీ ప‌రిస్తితి కూడా బాగోలేద‌ని పోలీసుల‌కు చెప్పిన‌ట్టు తెలిసింది. ఇది రాజ‌కీయ ప్రేరేపిత కేసేన‌ని పోలీసుల‌కు మాజీ ఎంపీ నందిగం చెప్పారు. ఈ కేసులో త‌న స‌తీమ‌ణి బేబీల‌త‌ పేరును చేర్చ‌డంపై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. పార్టీ ప‌రంగా తాము బాగా దెబ్బ‌తిన్నామ‌ని.. ప్ర‌స్తుతం ఖ‌ర్చుల‌కు కూడా డ‌బ్బులు లేవ‌ని.. జైల్లో పెడితే.. బెయిల్ కూడా తెచ్చుకునే ప‌రిస్థితిలో తమ కుటుంబం లేద‌న్న‌ట్టుగా అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

ఇదిలావుంటే.. రెండు రోజుల విచార‌ణ ముగియ‌డంతో నందిగం సురేష్‌ను తిరిగిపోలీసులు.. కోర్టుకు హాజ‌రు ప‌రిచారు. దీంతో స్థానిక కోర్టు ఆయ‌న‌కు మ‌రో 14 రోజుల పాటు జైలు విధించింది. కాగా.. గ‌తంలో నందిగం అరెస్టు కంటే ముందే ప‌లు కేసుల్లో బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌గా.. ప్ర‌స్తుత కేసులో అస‌లు బెయిల్ ఊసే లేకుండా పోయింది. దీనిని బ‌ట్టినందిగం ఆర్థిక స‌మ‌స్య‌ల్లో ఉన్నాన‌ని చెప్పిన మాట నిజ‌మేన‌ని తెలుస్తోంది.