Begin typing your search above and press return to search.

కమ్ముల - కింగ్.. కుబేర కోసం అక్కడ దిగారు!

ఇక షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు

By:  Tupaki Desk   |   13 March 2024 6:19 PM GMT
కమ్ముల - కింగ్.. కుబేర కోసం అక్కడ దిగారు!
X

భిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న శేఖర్ కమ్ముల ఈసారి ధనుష్ తో చేస్తున్న సినిమా మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కుబేర అంటూ టైటిల్ మాత్రం చాలా రిచ్ మీనింగ్ ఉండేలా సెట్ చేసిన కమ్ముల హీరో క్యారెక్టర్ ను మాత్రం బిచ్చగాడు తరహాలో చాలా దీనంగా చూపించాడు.

అయితే ఇందులో ఎంతో ఆలోచింపజేసే భావాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా హిస్టారికల్ నేపథ్యమున్న ఒక అంశాన్ని కూడా సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. నాగార్జున స్పెషల్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడు అంటే తప్పకుండా ఆ పాత్ర చాలా బలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతవరకు ఫినిష్ అయ్యింది. రీసెంట్ గా బ్యాంకాక్ లో మరొక కీలకమైన షెడ్యూల్ ను మొదలుపెట్టారు. అక్కడ నాగార్జునతో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక షెడ్యూల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

అందులో నాగార్జునతో ఒక సీన్ కోసం కమ్ముల చలా డీప్ గా చర్చిస్తున్నట్లుగా అర్థమవుతుంది. నాగార్జున ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు కూడా కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి. ఇక మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండే ధనుష్ క్యారెక్టర్ ను అతను ఎలా హ్యాండిల్ చేశాడు అనేది ఈ సినిమాలో మరొక కోర్ పాయింట్ అని సమాచారం.

ఏది ఏమైనా ఈసారి దర్శకుడు శేఖర్ కమ్ముల తన మేకింగ్ విధానంతో స్టోరీ సెలక్షన్ తో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించబొతున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ గ్రూప్స్ తో పాటు అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకుంటున్నారు. బ్యాంకాక్ లో కీలకమైన షెడ్యూల్ అనంతరం మళ్లీ ఇండియాకి తిరిగి రానున్న చిత్ర యూనిట్ ధనుష్ తో మరొక ఎపిసోడ్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయబోతోంది.

ఇక హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర కూడా కథలో చాలా కీలకంగా ఉంటుందట. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే రూపొందిస్తున్నారు. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వాలి అనే ఆలోచనతో ఉన్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్న విషయం తెలిసిందే.