Begin typing your search above and press return to search.

పిక్స్ వైరల్... ఈ సింపుల్ సిటీ మూర్తి ఫ్యామిలీకే సాధ్యమా..?

తాజాగా మూర్తి ఫ్యామిలీ పలు సందర్భాల్లో వెరీ వెరీ సింపుల్ గా అన్నట్లుగా కనిపిస్తున్న సన్నివేశాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా మరోసారి ఆయన ఫ్యామిలీ సింపుల్ గా తిరుగుతూ కనిపించింది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 6:57 AM GMT
పిక్స్  వైరల్... ఈ సింపుల్  సిటీ మూర్తి ఫ్యామిలీకే సాధ్యమా..?
X

ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లు నటించడం ఎంత కష్టమో... అన్నీ ఉండి సింపుల్ బ్రతకడం చాలా కష్టమని అంటుంటారు చాలా మంది! పైగా రెండోదాని చుట్టూ చాలా సమస్యలే ఉంటాయని చెబుతుంటారు. పైగా అది అందరికీ సాధ్యం కాదని.. అది అనుకున్నంత ఈజీ కూడా కాదని అంటుంటారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా మూర్తి ఫ్యామిలీ పలు సందర్భాల్లో వెరీ వెరీ సింపుల్ గా అన్నట్లుగా కనిపిస్తున్న సన్నివేశాలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా మరోసారి ఆయన ఫ్యామిలీ సింపుల్ గా తిరుగుతూ కనిపించింది.

అవును... ఇటీవల బెంగళూరులోని ఒక ఫేమస్ ఐస్ క్రీం పార్లర్ లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి.. ఆయన కుమర్తె, యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో సింపుల్ గా ఐస్ క్రీం తింటూ కనిపించిన వీరిద్దరి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇది మూర్తి ఫ్యామిలీకే సాధ్యం అనే కామెంట్లూ వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి నారాయణ మూర్తి కుటుంబం బెంగళూరు వీధుల్లో పర్యటించింది.

ఇందులో భాగంగా... ఆయన సతీమణి సుధామూర్తి, కుమార్తె అక్షతా మూర్తి, మనవరాళ్లతో కలిసి నారాయణమూర్తి... రాఘవేంద్ర మఠ్ కు వెళ్లారు. ఈ క్రమంలో సామాన్య ప్రజలు మాదిరిగానే రోడ్లపై దుకాణాలన్నీ చూస్తూ.. కొత్తగా వచ్చిన పుస్తకాలను పరిశీలిస్తూ కనిపించారు. ఈ సమయంలో వారి వెంట ఎలాంటి భద్రతా లేకపోవడం గమనార్హం. దీంతో... ఈ సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

అయితే ఈ వీడియో నిన్న మొన్నల్లోదేనా.. లేక ఎప్పుడు తీశారు అనేది క్లారిటీ లేదు కానీ... మూర్తి కుటుంబ సభ్యుల సింపుల్ సిటీపై మాత్రం ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. కాగా... గత ఏడాది జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో భాగంగా తన భర్త, యూకే పీఎం రిషి సునాక్‌ తో కలిసి అక్షత మూర్తి భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.