Begin typing your search above and press return to search.

"ఈ ఉగ్రవాదులు దొరికితే"... మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ కామెంట్స్!

ఈ నేపథ్యంలో ఈ ఉగ్రదాడిని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సిరాజ్... తన అభిప్రాయాన్ని, ఆగ్రహన్ని వ్యక్తపరిచారు.

By:  Tupaki Desk   |   23 April 2025 12:24 PM
ఈ ఉగ్రవాదులు దొరికితే... మహ్మద్ సిరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
X

జమ్మూకశ్మీర్ లోని పహల్గాం కొండ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకూ 26 మంది మృతి చెందగా.. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఉగ్రదాడిపైనా.. దాని వెనకుండి కథ నడిపినవారిపైనా తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ స్పందించారు.

అవును... పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడి నేపథ్యంలో ఉగ్రవాదులపైనా, వారిని వెనకుండి నడిపించినవారిపైనా తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉగ్రదాడిని టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన సిరాజ్... తన అభిప్రాయాన్ని, ఆగ్రహన్ని వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికలపై స్పందించిన సిరాజ్... పహల్గాం ఉగ్రదాడిని "క్రూరమైన చర్య"గా అభివర్ణించారు. ఈ సందర్భంగా... ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై ఎలాంటి కనికరం లేకుండా శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు చెబుతూ... ఈ మతోన్మాద పిచ్చి త్వరలో ముగిసిపోతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... మతం పేరుతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని చంపడం పూర్తిగా దుర్మార్గమని.. కారణం ఏదైనా, నమ్మకం మరేదైనా, ఏ భావజాలమైనా ఇలాంటి క్రూరమైన చర్యను సమర్ధించలేవని సిరాజ్ స్పష్టంగా రాసుకొచ్చారు. మనుషుల ప్రాణాలకు విలువలేని చోట ఇది ఎలాంటి యుద్ధం? అని ఈ సందర్భంగా సిరాజ్ ప్రశ్నించారు.

ఇదే సమయంలో... ఆ కుటుంబాలు అనుభవిస్తున్న బాధను తాను ఊహించుకోలేకపోతున్నానని చెప్పిన సిరాజ్.. ఈ భరించలేని దుఖాన్ని తట్టుకునే శక్తిని ఆ కుటుంబాలు పొందాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. "ఈ పిచ్చి త్వరగా ముగిసిపోతుందని.. ఈ ఉగ్రవాదులను కనుగొని, కనికరం లేకుండా శిక్షించాలని" తాను ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు.

ఇదే సమయంలో.. టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్, హైదరాబాదీ వీవీఎస్ లక్షణ్ తాజా ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ దాడి చాలా బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలియజేసిన లక్షణ్.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని, వారికి త్వరగా న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.